పరిస్థితి ఇంకా విషమమే: వైద్యవర్గాలు | shobha nagireddy condition still critical, say doctors | Sakshi
Sakshi News home page

పరిస్థితి ఇంకా విషమమే: వైద్యవర్గాలు

Apr 24 2014 7:58 AM | Updated on Aug 30 2018 3:58 PM

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభానాగిరెడ్డి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభానాగిరెడ్డి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఆమెకు ముక్కు, చెవుల్లోంచి కూడా రక్తం వచ్చినట్లు కర్నూలు జిల్లాలో వైద్యులు ప్రాథమికంగా తెలిపారు. అందువల్ల బహుశ మెదడులో ఏమైనా గాయాలు ఉన్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఆమె శ్వాస తీసుకోడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల ప్రస్తుతానికి వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలోని ఆర్థో, న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ ముగ్గురూ కలిసి శోభా నాగిరెడ్డిని పరీక్షించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శోభా నాగిరెడ్డితో పాటు ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా హైదరాబాద్కు వచ్చారు. ఆమె చికిత్స పొందుతున్న కేర్ ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. పలు మీడియా ఛానళ్లకు చెందిన ప్రతినిధులు కూడా ఆస్పత్రి వద్దకు ఉదయమే చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement