నేడు అవనిగడ్డ నుంచి షర్మిల యాత్ర ప్రారంభం | Sharmila AVANIGADDA tour from today | Sakshi
Sakshi News home page

నేడు అవనిగడ్డ నుంచి షర్మిల యాత్ర ప్రారంభం

Sep 12 2013 2:05 AM | Updated on Sep 1 2017 10:37 PM

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర గురువారం జిల్లాలో కొనసాగనుంది.

 సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర గురువారం జిల్లాలో కొనసాగనుంది. బుధవారం రాత్రి అవనిగడ్డ బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం రాత్రి బసకు చేరుకున్నారు. గురువారం ఉదయం అవనిగడ్డ నుంచి బస్సుయాత్ర ప్రారంభమై చల్లపల్లి, కొడాలి, పామర్రు, అడ్డాడ, గుడ్లవల్లేరు, విన్నకోట, ముదినేపల్లి మీదుగా కైకలూరు చేరుకుంటారు. కైకలూరులోని అడవినాయుడు సెంటర్‌లో జరిగే బహిరంగసభలో ప్రసంగించి అక్కడనుంచి పశ్చిమగోదావరి జిల్లాకు వెళతారని పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ప్రోగాం కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement