వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర గురువారం జిల్లాలో కొనసాగనుంది.
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర గురువారం జిల్లాలో కొనసాగనుంది. బుధవారం రాత్రి అవనిగడ్డ బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం రాత్రి బసకు చేరుకున్నారు. గురువారం ఉదయం అవనిగడ్డ నుంచి బస్సుయాత్ర ప్రారంభమై చల్లపల్లి, కొడాలి, పామర్రు, అడ్డాడ, గుడ్లవల్లేరు, విన్నకోట, ముదినేపల్లి మీదుగా కైకలూరు చేరుకుంటారు. కైకలూరులోని అడవినాయుడు సెంటర్లో జరిగే బహిరంగసభలో ప్రసంగించి అక్కడనుంచి పశ్చిమగోదావరి జిల్లాకు వెళతారని పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ప్రోగాం కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్లు తెలిపారు.