ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | Seven arrested for Red sandalwood smuggling | Sakshi
Sakshi News home page

ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Jun 15 2015 3:12 PM | Updated on Sep 3 2017 3:47 AM

వైఎస్సార్ జిల్లా సబ్ డివిజన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు.

వైఎస్సార్ జిల్లా :  వైఎస్సార్ జిల్లా సబ్ డివిజన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం టీజీ పల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనంలో ముగ్గురు వ్యక్తులు పది ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నట్లు  గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా... వారు ఇచ్చిన సమాచారం మేరకు సీకే దిన్నె మండలం మద్దిపాడు సమీపంలోని మరో రెండు వాహనాల్లో తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలను, నలుగురు స్మగర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ముగ్గురు కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాకు చెందిన వారుగా తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement