రాయచోటిలో సమైక్య 'రణభేరి' | Samaikya Ranabheri in Rayachoti | Sakshi
Sakshi News home page

రాయచోటిలో సమైక్య 'రణభేరి'

Sep 26 2013 11:20 AM | Updated on Sep 1 2017 11:04 PM

డప జిల్లా రాయచోటిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రాయచోటి 'రణభేరి'కి అపూర్వ స్పందన లభించింది.

రాయచోటి : కడప జిల్లా రాయచోటిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రాయచోటి 'రణభేరి'కి అపూర్వ స్పందన లభించింది. సుమారు లక్ష మంది ఈ భేరీకి తరలివచ్చారు. రైతులతో పాటు ద్వాక్రా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుతోపాటు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారంతా ఈ వేదిక మీదుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సమైక్యాంధ్రకు మద్దతుగా లక్కిరెడ్డిపల్లిలో రిలే దీక్షలు చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలకు  అశోక్‌బాబు సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement