భావోద్వేగానికి గురైన సాంబశివరావు | Sabmba shivarao retired from DGP post | Sakshi
Sakshi News home page

భావోద్వేగానికి గురైన సాంబశివరావు

Dec 31 2017 4:39 PM | Updated on Dec 31 2017 4:39 PM

Sabmba shivarao retired from DGP post - Sakshi

విజయవాడ  : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ పదవికి ఉద్యోగ విరమణ చేసిన నండూరి సాంబశివరావు ఆదివారం భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త డీజీపీగా డా.ఎం.మాలకొండయ్య ఛార్జ్ తీసుకున్నారు. ఆరు నెలల పాటు మాలకొండయ్య డీజీపీగా కొనసాగనున్నారు. పదవి విరమణ చేసిన సాంబశివరావుకు ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎక్స్ డీజీపీ సాంబశివరావును ఐపీఎస్‌ అధికారులు పోలీసు రథంలో కూర్చోబెట్టి సాధరంగా దాన్ని లాక్కెల్లి వీడ్కోలు పలికారు. కాగా, కొత్త డీజీపీ మాలకొండయ్య రథం తాడును లాగడంతో సాంబశివరావు భావోద్వేగానికి గురయ్యారు. నూతన డీజీపీ మాలకొండయ్యకు రాష్ట్రంలోని ఐపీఎస్ లు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement