ఎండుతున్న చెరువులు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు
బిట్రగుంట, న్యూస్లైన్: బోగోలు మండలాన్ని తాగునీటి ఎద్దడి తరుముకొస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసవి ప్రారంభానికి ముందే చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్లలో నీటి శాతం తగ్గింది. దీంతో పల్లెలు గుక్కెడు నీటి కోసం గుటకలు మింగుతున్నాయి. ఇప్పటికే ఉమామమహేశ్వరపురం, తెల్లగుంట, అల్లిమడుగు, సిద్ధవరపు వెంకటేశ్వరపాళెం, పాతబిట్రగుంట, కొండబిట్రగుంట, తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది.
మండలంలో 16 మైనర్, ఆరు పంచాయతీరాజ్ చెరువులు ఉండగా సుమారు 12 చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. మొత్తం 302 చేతి పంపులు ఉండగా 15 పంపులు మరమ్మతులకు గురయ్యాయి. మరో 40 బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో రోజుకు నాలుగు బిందెలు నీళ్లు కూడా రావడం లేదు. సుమారు 80కి పైగా బోర్లలో ఉప్పునీరు వస్తుండటంతో తాగేందుకు పనికిరావడం లేదు.
పేరుకు 36 తాగునీటి పథకాలు ఉన్నా భూగర్భ జలాల తగ్గిపోవడం, విద్యుత్ కోత లు, మరమ్మతులతో వారానికి ఒక రోజు కూడా తాగునీటి సరఫరా జరగడం లేదు. బోర్లు ఎండిపోవడంతో సిద్ధవరపు వెంకటేశ్వరపాళెంలోని తాగునీటి పథకం నిరుపయోగంగా మారింది.
విద్యుత్ కోతలు, మరమ్మతులతో కొండబిట్రగుంట, పాతబిట్రగుంటలకు మంచినీరు సరఫరా చేసే తాగునీటి పథకం కూడా మూలనపడింది. మరోవైపు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో బావుల్లో కూడా జలాల లభ్యత తగ్గుముఖం పట్టింది. దీంతో ఇళ్లలోని బావులు కూడా ఎండిపోతున్నాయి.
గ్రామాల్లో ఇదీ పరిస్థితి
తెల్లగుంట, ఉమామహేశ్వరపురం, అల్లిమడుగు, అల్లిమడుగు సంఘం గ్రామాలకు పైపులైన్ల మరమ్మతుల కారణంగా రెండు నెలల క్రితమే తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో బావులు కూడా ఎండిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావులపై ఆధారపడుతున్నారు. పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామాలకు పైపులైన్ల మరమ్మతులు, విద్యుత్ కోతల కారణంగా నెల రోజుల నుంచి తాగునీటి స రఫరా నిలిచిపోయింది.
దీంతో గ్రామస్తులు కలుషితమైన కోనేరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. కోనే రు నీరు తాగేందుకు పనికిరావంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు గతంలో గ్రామంలో దండోరా వేయించారు. విధిలేని పరిస్థితుల్లో ఆ నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు.
బోగోలు, విశ్వనాథరావుపేట పంచాయతీలను తాగునీటి కొరత వేధిస్తుంది. అధికారులు స్పందించి బోర్లు లోతు పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయకుంటే మరో 15 రోజుల్లో దాదాపు అన్ని గ్రామాలు తాగునీటికి తహతహలాడే పరిస్థితులు దుస్థితి ఏర్పడుతుంది.
ముంచుకొస్తున్న ఎద్దడి
Published Mon, Apr 14 2014 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement