అనంతలో రూ. 3 కోట్లు గోల్మాల్ | Rs. 3 crores scam in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో రూ. 3 కోట్లు గోల్మాల్

Mar 25 2015 4:28 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా నీటి యాజమాన్య సంస్థలో రూ. 3 కోట్ల మేర నగదు గల్లంతైనట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తన తనిఖీల ద్వారా గుర్తించారు.

అనంతపురం: అనంతపురం జిల్లా నీటి యాజమాన్య సంస్థలో రూ. 3 కోట్ల మేర నగదు గల్లంతైనట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తన తనిఖీల ద్వారా గుర్తించారు. దీంతో ఈ అంశంపై విచారణకు ఆయన బుధవారం ఆదేశించారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టమని ఆయన తెలిపారు.

నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించ లేదని కలెక్టర్ కోన శశిధర్ తన తనిఖీల్లో గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement