నిద్రమత్తులో డ్రైవర్‌.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు! | Road Accident in Kanigiri | Sakshi
Sakshi News home page

నిద్రమత్తులో డ్రైవర్‌.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు!

Nov 17 2019 1:41 PM | Updated on Nov 17 2019 2:46 PM

Road Accident in Kanigiri - Sakshi

సాక్షి, కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి స్టేజి సమీపంలో  జాతీయ రహదారి 565పై రోడ్డుప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తులో జోగుతూ కారును నడిపించడంతో.. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రైలింగ్‌ను దాటి.. పల్టీలు కొడుతూ.. పంటపొల్లాలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారు పూణే నుంచి కనిగిరి మండలం మాచవరంలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement