విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యంచేశారు. ఇంద్రకీలాద్రి కింద నుంచి వృద్ధులు, వికలాంగులను పైకి తీసుకొచ్చేందుకు దేవస్థానం లిఫ్టు ఏర్పాటు చేసింది. ఈ లిఫ్టు వద్ద తుని సీఐ ఒ.చెన్నకేశవరావుతో పాటు కొంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తూ పోలీసు కుటుంబాలు, వీఐపీల కుటుంబాలను తప్ప మిగిలిన వారిని లిఫ్ట్లోకి అనుమతించని విషయం తెలుసుకున్న ఒక మీడియా ప్రతినిధి కె.పూర్ణ, వీడియో జర్నలిస్టు రమేష్, మరో రిపోర్టర్ చైతన్య అక్కడకు వెళ్లారు. లిఫ్టులో వచ్చే, వెళ్లే వారిని వీడియో రికార్డింగ్ చేస్తుండటంతో పూర్ణాతో చెన్నకేశవరావు వాగ్వివాదానికి దిగారు.
తాను చానల్ ప్రతినిధినని, ఐడెంటిటీ కార్డు చూపించినా కెమెరా, సెల్ఫోన్లను లాక్కున్నారు. ఫోన్లు ఇచ్చివేయాలని విలేకరులు గట్టిగా కోరడంతో దాడికిదిగి పూర్ణా మెడపై తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న పోలీసులు ఆ వెంటనే మీడియా ప్రతినిధులపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. చైతన్య తప్పించుకుని మీడియా పాయింట్ వద్ద ఉన్న మిగిలిన విలేకరులకు వద్దకు వచ్చి దాడి విషయం చెప్పాడు. విలేకరులు వెళ్లి పోలీసులను ప్రశ్నిం చగా, వీడియో తీయడం ఆపి, రికార్డయిన దృశ్యాలను తొలగించమంటే పట్టించుకోలేదని ఎదురు దాడికి దిగారు. పూర్ణాతో జరిగిన తోపులాటలో తన కాలికి గాయం అయిందంటూ చెన్నకేశవరావు బుకాయించడానికి ప్రయత్నిం చారు. అనంతరం విలేకరులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. కొద్దిసేపటికీ ఏసీపీ ఎ.వి.ఎన్.శివరామ్, డీసీపీ కాళీదాస్ రంగరావు వచ్చి చెన్నకేశవరావు వద్ద ఉన్న పూర్ణా, చైతన్య సెల్ఫోన్లను వారికి ఇప్పించారు. అయితే వివాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తొలగించారని పూర్ణా డీసీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ కాళిదాసు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
మంత్రి రావెల ప్రెస్మీట్ బహిష్కరణ
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి రావెల కిషోర్బాబు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడబోగా విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆయనకు తీవ్ర నిరసన తెలిపి సమావేశాన్ని బహిష్కరించారు. సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి దాడి ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మీడియా ప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం
Published Sat, Oct 17 2015 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement