రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sanders worth Rs crore seized in chittoor district | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

May 1 2014 12:20 AM | Updated on Sep 2 2017 6:44 AM

కర్ణాటక నుంచి తమిళనాడుకు కుప్పం మీదుగా వెళ్తున్న రూ. కోటి విలువచేసే ఎర్రచందనం లారీని అటవీ శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు.

కుప్పం, న్యూస్‌లైన్: కర్ణాటక నుంచి తమిళనాడుకు కుప్పం మీదుగా వెళ్తున్న రూ. కోటి విలువచేసే ఎర్రచందనం లారీని అటవీ శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు. ముందస్తుగా వచ్చిన సవూచారం మేరకు పోలీసులు, అటవీ శాఖాధికారులు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని వి. కోట వద్ద కాపుకాశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న లారీలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయన్న అనుమానంతో తనిఖీ చేశారు.

వీరిని చూసి డ్రైవరు, క్లీనరు వాహనాన్ని వదిలిపెట్టి  పరారయ్యూరు. వాహనాన్ని కుప్పం అటవీ శాఖ కార్యాలయానికి తరలించి పూర్తిగా తనిఖీ చేశారు. అందులో ఎర్రచందనం ఉన్నట్లు బయటపడింది. ఈ వాహనంలో మాత్రలు, మందుల బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు, వివాహ పత్రికలు, మరిన్ని పార్సిళ్లు నింపారు. అడుగు భాగంలో ఎర్రచందనం దుంగలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement