వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం కన్నుమడుగు గ్రామంలో శనివారం ఉదయం ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రైల్వేకోడూరు : వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం కన్నుమడుగు గ్రామంలో శనివారం ఉదయం ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడుకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి 5 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితుడి నుంచి 88 కిలోల 5 దుంగలను స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖాధికారి పిచ్చయ్య తెలిపారు. వీటి విలువ రూ.60వేలు ఉంటుందన్నారు.