విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
విజయవాడ : విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నగలు, నగదు కోసమే నిందితుడు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో లిప్ట్ మెకానిక్ ప్రధాని నిందితుడిగా భావిస్తున్నారు. పండక్కి అందరూ ఊరెళ్లారని తెల్సుకుని .. ఇంట్లో బామ్మ, మనవరాలే ఉన్నారని గమనించి దుండగుడు ఈ ఘటనకు పాల్పడ్డారు.
అత్యంత దారుణంగా కత్తులతో గొంతుకోసి, ఇక చోరీ చేద్దామనేలోగా, ఏదో అలికిడి వినబడి పారిపోయాడు. ఈ దారుణంలో సత్యనారాయణ భార్య పుణ్యవతి, మనవరాలు సాయిచంద్రికలు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. చంద్రికతో ఆడుకుందామని ఆమె ఇంటికి వచ్చిన స్నేహితులు .. వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి పెద్దలకు చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.