శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారు: పండిట్ | power production stalled in srisailam, says water board chairman pandit | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారు: పండిట్

Oct 24 2014 6:15 PM | Updated on Apr 7 2019 3:47 PM

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు తమ విచారణలో తేలిందని కృష్ణా వాటర్ బోర్డు ఛైర్మన్ ఎస్.కె.జి. పండిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు తమ విచారణలో తేలిందని కృష్ణా వాటర్ బోర్డు ఛైర్మన్ ఎస్.కె.జి. పండిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. శ్రీశైలం నీటి వివాదంపై త్వరలోనే రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాయలసీమ ఎడారి అవుతుందని కృష్ణా వాటర్ బోర్డు ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement