పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి.. | police martyrs services | Sakshi
Sakshi News home page

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి..

Oct 22 2013 2:29 AM | Updated on Aug 29 2018 4:16 PM

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు.

 సాక్షి, నల్లగొండ :విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నల్లగొండలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులకు నివాళులర్పించారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వారి సేవలను మననం చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎంతో ముఖ్యమో.. సమాజానికి పోలీసు కూడా అంతే అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అమరవీరుల కుటుం బాలకు ఎంత టి మేలు చేసినా తక్కువేనన్నారు. ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పోలీసు అమరుల లక్ష్యాలు, ఆశయాల సాధనకు ప్రతి పోలీసు కంక ణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడులను, సంఘవి ద్రోహ శక్తులను తిప్పికొట్టాలని ఉద్భోదించా రు. అప్పుడు మాత్రమే వారి త్యాగాలకు సార్థకత లభిస్తుందన్నారు. అమరుల కుటుంబాల కు అనుకున్న స్థాయిలో న్యాయం జరగడం లే దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండబోదని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
 
 నివాళ్లు.. కన్నీటి ధారలు
 కలెక్టర్, ఎస్పీల స్థాయి నుంచి ఒక్కొక్కరుగా పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్నారు. వారి సేవలను స్మరించుకుంటున్నారు. త దుపరి అమరవీరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వంతు వచ్చింది. స్థూపం వద్దకు వెళ్లిన వారందరూ అశ్రు నివాళులర్పిం చారు. ఇలా ఒకరివెంట ఒకరు తమ వారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని చూసిన వారి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. నిశ్శబ్దం ఆవహించింది. అందరి మదిలోనూ వారి త్యాగాలే మెలిగాయి. 
 
 భారీ ర్యాలీ
 అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ పోలీసు అధికారులు, పోలీసులు, విద్యార్థులు నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హెడ్‌క్వార్టర్‌‌స నుంచి గడియారం సెంటర్, ప్రకాశంబజార్, పాత కలెక్టరేట్ మీదుగా తిరిగి హెడ్‌క్వార్టర్‌‌స వరకు ర్యాలీ కొనసాగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘పోలీసు అమరవీరులకు.. జోహార్లు’ అంటూ నినదిస్తూ ముందుకు కదిలారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ సయ్యద్ రియాజ్ బేగ్, డీఎస్పీ విజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణ్, మనోహర్‌రెడ్డి, రవి, శ్రీనివాసులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
 కానిస్టేబుల్ ఎంఏ కరీంకు పూర్తి వేతనం
 నక్సల్స్ దాడిలో తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్‌కు పూర్తి వేతనాన్ని ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు సోమవారం అందజేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చే తుల మీదుగా నాలుగేళ్ల వేతనాన్ని కరీం అందుకున్నారు. 2006 ఆగస్టులో ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌పై నక్సల్స్ దాడి ఘటనలో తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్ కరీంను కలెక్టర్ పరామర్శించారు. అప్పటి ఘటన గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు.
 
 బహుమతుల ప్రదానం
 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన పోలీసులకు, విద్యార్థులకు ఎస్పీ, జేసీ హరిజవహర్‌లాల్ ప్రశంసపత్రాలు అందజేశారు. ఎస్‌ఐలు డి.వెంకటేశ్వర్లు (మొదటి), ఎన్.విజయ్ ప్రకాశ్ (ద్వితీయ), వి.నారాయణరె డ్డి (తృతీయ) బహుమతులు సాధించారు. అలాగే ఏఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, పీసీలు రాంచందర్ రాజు, పి. బచర్, కె.రేవతిలు ప్రశంసపత్రాలు అందుకున్నారు. వక్తృత్వ పోటీల్లో విజేతులుగా నిలిచిన విద్యార్థులు లాస్య, ప్రవళిక, అఖిల, యశ్వంత్ కుమార్, బాలమనోజ్, సంతోష్‌రెడ్డి, నిశిత తదితరులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement