చంద్రబాబు కుటుంబం ఆస్తులపై పిటిషన్‌ దాఖలు

Petition Filed In High Court Of Judicature At Hyderabad On Heritage Group oF Companies Income - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఆస్తుల వివరాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియాతో విచారణ జరిపించాలని ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది రామారావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తున్న హెరిటేజ్‌ గ్రూప్‌ కంపెనీల ఆదాయాన్ని ఫోరెన్సిక్ అడిట్ చేయించాలని కోరారు. గతంలో మొత్తం 14 కంపెనీలపై ఆర్వోసీ(రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌)కి ఫిర్యాదు చేస్తే కేవలం ఐదు కంపెనీలపై మాత్రమే చర్యలు తీసుకున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. మిగతా తొమ్మిది కంపెనీలపై కూడా చర్యలు చేపట్టేవిధంగా ఆర్వోసీని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top