నేడు కూడా పింఛన్ల పంపిణీ | Pensions Distribution to home on 04-02-2020 also | Sakshi
Sakshi News home page

నేడు కూడా పింఛన్ల పంపిణీ

Feb 4 2020 5:16 AM | Updated on Feb 4 2020 5:16 AM

Pensions Distribution to home on 04-02-2020 also - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగనుంది. ప్రతినెలా మూడు పనిదినాలు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీనే వాటి పంపిణీని ప్రారంభించిన వలంటీర్లు.. రెండో రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ పింఛన్లు అందజేశారు. సోమవారం సాయంత్రం నాటికి 93 శాతం పూర్తికావడంతో మంగళవారం కూడా పింఛన్లను పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈఓ రాజాబాబు ‘సాక్షి’కి తెలిపారు.  

ఫిబ్రవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం 54,68,309 మంది పింఛనుదారులుండగా.. సోమవారం నాటికి 50,42,126 మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని రాజాబాబు చెప్పారు. రూ.1,210 కోట్ల మొత్తం లబ్ధిదారులకు చేరిందన్నారు. వలంటీర్ల వల్ల ఎప్పుడూ లేని విధంగా ఈసారి 99 శాతం దాకా పింఛన్ల పంపిణీ జరిగే అవకాశం ఉందన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement