కోవెలకుంట్ల, న్యూస్లైన్ :
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది శనగ రైతు దుస్థితి. అసలే పంటలు పండక.. గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతున్న తరుణంలో.. ఉన్న దిగుబడులను కూడా వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లో శనగ పంట సాగవుతోంది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం బస్తా రూ.5500 ప్రకారం కొనుగోలు చేసింది. ఈ ధర కేవలం మూడు, నాలుగునెలలు మాత్రమే కొనసాగింది. అప్పట్లో ధరలు మరింత పెరుగుతాయని కొందరు రైతులు విక్రయించలేదు. చాలా మంది రైతుల దిగుబడులు పొలాల్లో కోత దశలోనే ఉన్నాయి. దీంతో పెరిగిన ధరలను ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒక్కసారిగా ధరలు రూ.3 వేలకు పడిపోవడంతో నిల్వలను 2011-12 సంవత్సరాల్లో గోదాములకు చేర్చారు. వాటిపై రుణాలు తీసుకుని ఈ ఏడాది శనగ సాగు చేశారు.
కౌలు ఖర్చులు కలుపుకుని ఎకరాకు రూ.20 వేలు వెచ్చించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు 5 బస్తాల దిగుబడి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో గోదాముల్లోని 350 మంది రైతుల దిగుబడులను వేలం వేస్తున్నట్లు కోవెలకుంట్ల స్టేట్బ్యాంక్ అధికారులు ప్రకటన జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిగుబడులను అమ్మినా గోదాము బాడుగలు, తీసుకున్న రుణం, వడ్డీ కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే భార్యా పిల్లలను ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొంటున్నారు.
రెండేళ్లుగా గోదాములోనే 110 బస్తాలు: భాస్కర్రెడ్డి, గుళ్లదూర్తి
గుళ్లదూర్తిలో 15 ఎకరాల సొంతపొలంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. 110 బస్తాల తెల్ల శనగలను అల్లూరు గోదాములో నిల్వ ఉంచాను. వాటిపై బ్యాంకులో రూ.2.10 లక్షల రుణం తీసుకున్నా. రెండేళ్లుగా గిట్టుబాటు ధరలేక అమ్మలేకపోయాను.
రూ. 4.40 లక్షల రుణం తీసుకున్నాను: మల్లికార్జునరెడ్డి, గుళ్లదూర్తి
పదెక రాల సొంతపొలంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని ఏటా శనగ, వరి, జొన్న పంటలు సాగు చేస్తున్నాను. అల్లూరు గోదాములో 460 తెల్లశనగ బస్తాలను నిల్వ ఉంచి రూ. 4.40 లక్షలు రుణం తీసుకున్నాను. ఈ ఏడాది శనగ దిగుబడులు అంతంత మాత్ర ంగానే ఉన్నాయి. బ్యాంకు అధికారులు బస్తాలను వేలం వేస్తామంటున్నారు. ఇలాంటి సమయంలో వేలం వేస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
శనగ రైతులపై వేలం పిడుగు
Published Fri, Jan 10 2014 2:07 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్షణాలిలా..
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement