తణుకు అర్బన్ : తణుకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మోడల్ హాస్పటల్గా రూపుదిద్దుకోనుంది. వైద్యసేవలను ఆన్లైన్ ప్రక్రియలో నిక్షిప్తం చేసేందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తణుకు ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఈ నెల 15లోగా ఆసుపత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రావాలని వైద్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తణుకు ఏరియా ఆసుపత్రితో పాటు క్లస్టర్ పరిధిలోని 6 పీహెచ్సీల వైద్యసేవలను ఆన్లైన్ చేయనున్నారు. రోగి ప్రభుత్వాసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికివెళ్లినా వారి రోగ వివరాలతో పాటు వాడే మందులను కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. దీంతో వైద్య సేవలు మరింత సులభమవుతాయని వైద్యులు తెలిపారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసే సర్వర్ ద్వారా ఉన్నతాధికారులు ఆన్లైన్ సేవలను పర్యవేక్షించనున్నారు. తణుకు ఆసుపత్రి అనంతరం జిల్లాలోని మిగిలిన ఆసుపత్రుల్లో ఆన్లైన్ సేవలను ప్రారంభించనున్నారు.
ఆన్లైన్ సేవలిలా..
ఆన్లైన్ సేవల్లో భాగంగా చీటీలు అవసరం ఉండదు. రోగి ఆధార్ కార్డు నంబరు, బయోమెట్రిక్ విధానంతో వైద్యసేవలు మొదలవుతాయి. ముందుగా ఓపీ విభాగంలో ఆధార్తో రోగి వివరాలు నమోదు చేస్తారు. అక్కడి నుంచి వైద్యుని వద్దకు వెళ్లగానే సంబంధిత వైద్యులు ఆన్లైన్లో రోగికి అవసరమైన వైద్యపరీక్షలు పొందుపరుస్తారు. రక్తపరీక్షల విభాగంలో సైతం ఆన్లైన్లో వైద్యులు పొందుపరచిన పరీక్షలను నిర్వహించి అక్కడ కూడా ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. పరీక్షల ఆధారంగా వైద్యులు ఆన్లైన్లో మందుల వివరాలను రాస్తారు. ఫార్మసీలో ఆ మందులను రోగులకు అందిస్తారు. ఆన్లైన్ సేవలు పూర్తిస్థారుులో వినియోగంలోకి వస్తే రోగి ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా అతని వివరాలు అక్కడ లభ్యమవుతారుు. దీంతో అక్కడే వైద్య సేవలు పొందవచ్చు.
Breadcrumb
# Tag
Related news
-
తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వసమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు”అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారంఅని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూపాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్నసాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..“భాషాసౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయ వలసిన కృషి ఎంతైనా ఉందన్నారు” పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పీహెచ్డీ పట్టా అందుకుని, అదే విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.ప్రత్యక అతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలుమొదలైనసాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభా వంతంగా స్పృశించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వతెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)– ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన, పరిశోధనా విభాగంలో సహాయా చార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనేఅంశంపై పి.ఎచ్.డి చేస్తున్నబుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
టెక్నాలజీ.. ఈసీ ఈజీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పౌరులకు అవసరమైన ప్రతి సమాచారాన్నీ, అవసరమైతే స్పందించే సౌకర్యాన్నీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించింది. అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునేందుకు ‘కేవైసీ’, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’, బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు, ప్రచార అనుమతుల కోసం ‘సువిధ’.. ఇలా ఎన్నో యాప్లు, వైబ్సైట్లు. వీటి ద్వారా ఓటరు నమోదు నుంచి మొదలుపెడితే ఫిర్యాదులు, నామినేషన్లు, ప్రచార అనుమతులు, కౌంటింగ్, ఫలితాల వరకూ ప్రతీదీ ఇంట్లోనే కూర్చుని తెలుసుకునే వీలుండటం గమనార్హం. ఓటు నమోదు చేసుకోండి కొత్త ఓటు నమోదు, ఓటు బదిలీ, తప్పులు సరి చేసుకునేందుకు ‘ఓటర్ హెల్ప్లైన్’ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను పొందవచ్చు. అభ్యర్థులెవరో తెలుసుకోండి నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ద్వారా ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలతో పాటు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడఫిట్లు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని రూపొందించింది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర, స్థిరచరాస్తులు వంటి సమాచారం ఉంటుంది. ‘సువిధ’తో సులభం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం, ప్రచార అనుమతులు పొందడం ‘సువిధ’తో సులభతరం అవుతుంది. అభ్యర్థులు ఇంట్లో కూర్చొని తొలుత ఆన్లైన్లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల ఆఫిడవిట్ పత్రాలు, నామినేషన్ను బలపరిచేందుకు పది మంది ఇతరుల వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు సమర్పించిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ‘సక్షం’తో చేయూత పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ‘సక్షం’యాప్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆయా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక స్వచ్చంధ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీ వంటి సదుపాయాలను సమకూరుస్తారు. అబ్జర్వర్, ఈఎస్ఎంఎస్ పోలీసులు, వ్యయ పరిశీలకుల కోసం అభివృద్ధి చేసిన యాప్ ‘అబ్జర్వర్’. ఎన్నికల పరిశీలకులు నివేదికలు సమర్పించడానికి, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సీ విజిల్ కేసులను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) యాప్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల వివరాలు, సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతరత్రా వస్తువుల డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ ఉపయోగపడుంది. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజున ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటివి ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ‘ఓటర్ టర్నౌట్’ కేంద్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన యాప్లలో ఈ ‘ఓటర్ టర్నౌట్’కీలకమైంది. రియల్ టైం డేటా ఆధారంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వారీగా సుమారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేస్తారు. ఈ డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఉంది. నిర్దిష్టమైన ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని అంచనా వేసే వీలుండటంతో ఇది అభ్యర్థులకు, మీడియా సంస్థలకు ఉపయుక్తకర సాధనం. అయితే ఇది కేవలం శాసనసభ, లోకసభ, ఉప ఎన్నికల సమయాలలో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ‘నోడల్’ మేడ్ ఈజీ ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతుల ప్రక్రియను సులభతరంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ‘ఎన్కోర్ నోడల్’యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి సంబంధించిన అనుమతులు జారీ చేయవచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులు, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి అభ్యర్థులకు నోటిఫికేషన్ పంపవచ్చు. -
Ugadi 2024: ఆన్లైన్లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే 2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ!
చార్ధామ్ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఓపెన్ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్ధామ్ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి. పర్యాటక శాఖ వెబ్సైట్ registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్ధామ్ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటు నమోదుకు ఇక మూడు రోజుల సమయమే ఉంది. 18 సంవత్సరాల వయసు నిండి.. ఓటర్ జాబితాలో పేరులేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫాం–6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓటర్ జాబితాలో పేరుందో, లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ.. జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫాం–6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిది’ అని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రాకుండా.. అధికారులు అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని సరి చూసిన తర్వాతే ఓటర్గా నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా.. ఫిజికల్గా ఆధార్ కాపీ, వయసు నిర్దారణ ధ్రువపత్రంతో పాటు ఇంత వరకు ఎక్కడా ఓటు హక్కు లేదన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఓటర్గా నమోదు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసి వదిలేయకుండా.. అన్ని కాపీలను తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా సూచించారు.
Related News by category
-
అవినీతిలో ‘ఆది’పత్యం
ఆయనో మాజీ మంత్రి. సొంత పేరు కంటే.. పేకాట పాపారావంటే స్థానిక ప్రజలు సులభంగా చెప్పేస్తారు. సోదరుడిని, ఆయన తయారు చేసుకున్న వర్గాన్ని అణగదొక్కి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్ భిక్షతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మరణం తర్వాత విచ్చలవిడి దోపిడీకి బరితెగించారు. గండికోట ప్రాజెక్టు, గాలేరు–నగరి సొరంగం పనుల కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లలో దోచుకున్నారు.కాలువ తవ్వకాల్లో వచి్చన బండరాళ్లను కూడా వదల్లేదు. కంకరగా మార్చి అక్రమార్జన చేశారు. పక్క రాష్ట్రానికి ఇసుక తరలించేందుకు పెన్నానదికి గర్భశోకం కలిగించారు. నీరు–చెట్టు పథకంలో ఆయన దోపిడీకి అడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నమ్మినవారిని నట్టేట ముంచడం,పారీ్టలు మారడం అంటే ఆయనకు మంచినీళ్లు తాగినంత సులభం.సాక్షి టాస్క్ ఫోర్స్: ‘‘జమ్మలమడుగులో వర్గ పోరాటం కొనసాగించాం. మా సర్వస్వం కోల్పోయాం. ఆస్తులు కూడా తాకట్టులో ఉన్నాయి. ఒక్క అవకాశం ఇవ్వండి..’’ అంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గెలిచారు. ఆ తర్వాత ఆయన సాగించిన దోపిడీతో రాష్ట్రంలోనే అత్యధిక సంపాదనాపరుల్లో ఒకరిగా మారారు. ప్రకృతి వనరుల దోపిడీలో ఆయన జోరు చూసి నియోజకవర్గ ప్రజలే నోరెళ్లబెట్టారు. ప్రభుత్వ, కొండ పోరంబోకు భూములను వందల ఎకరాలు స్వాహా చేసి, తన సాగులోకి చేర్చుకున్నారు. సోలార్ ప్రాజెక్టు పనుల్ని శాసించారు. చివరికి గండికోట నిర్వాసితుల చెక్కుల్నీ స్వాహా చేశారు. చెప్పుకుంటూ పోతే.. ఆయన అక్రమాలకు లెక్కే లేదు. ఇప్పుడు కేంద్ర పారీ్టలో చేరి, మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రతి అవకాశం.. ఆదాయ మార్గందేవగుడి, గొరిగనూరు, పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె, చలివెందుల, సుగమంచుపల్లె, ధర్మాపురం గ్రామాల్లో ఈ నేత కుటుంబ ఆధిపత్యం యథేచ్ఛగా సాగుతోంది. అనూహ్య పరిస్థితుల్లో అమాత్యుని హోదా దక్కించుకున్నారు. ఇంకేముంది ఆయా గ్రామాల పరిధిలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బెంగళూరు తదితర ప్రాంతాలకు భారీ వాహనాలతో ఇసుకను తరలించారు. కేవలం ఇసుక తరలింపుతోనే రూ.వందల కోట్లు ఆర్జించారు.పేకాట పాపారావు ఈయనకు స్థానికంగా మరో పేరు కూడా ఉంది. పేకాట పాపారావుగా బాగా ప్రసిద్ధి. 2019 ఎన్నికల తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పేకాట కోసం బెంగళూరు క్లబ్బును తన నివాసంగా మార్చుకున్నారు. గత నాలుగున్నరేళ్లూ నమ్ముకున్న కార్యకర్తలకు దూరంగా పత్తాలేకుండా పోయారు. ఆ మధ్య ఓ చానల్ ఇంటర్వ్యూలో కూడా తన జూద ప్రావీణ్యతను మహ సరదాగా చెప్పుకొచ్చారు.ఆ నేతపై ఉన్న కేసుల్లో కొన్ని ఈ నేతపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ∗ 2020లో క్రైమ్ నెం.130 పేరిట 143, 144, 147, 148, 323, 324, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ∗ మైదుకూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నెం.239/2020 కేసు ఉంది. ∗ తుళ్లూరులో క్రైమ్ నెం.65/2023 ఐపీసీ 294, 504, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదయినట్లు సదరు నేత తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు.ప్రభుత్వ భూములు స్వాహా.. ఈ మాజీ అమాత్యుని కుటుంబ సభ్యులు పెన్నానది ఇసుకతో సరిపెట్టుకోలేదు. ఇసుక తరలిపోగా ఏర్పడిన గట్టి ప్రాంతాన్ని వ్యవసాయ భూములుగా మార్చి, సాగులోకి తెచ్చారు. సమీప బంధువుల పేరిట సున్నపురాళ్లపల్లె సమీపంలో 300 ఎకరాలు సాగుచేసి అనుభవిస్తుండగా, అవి స్టీల్ ప్లాంట్ పరిధిలోకి వెళ్లాయి. సర్వే నెం.411లో కొండపోరంబోకు భూమిని ఆక్రమించి బినామీల పేర్లతో సాగు చేసుకునేవారు. సర్వే నెం.64లో గొరిగనూరు గ్రామానికి చెందిన ఈతని బంధువు సబ్ డివిజన్ చేయించి మరీ భూముల్ని ఆక్రమించారు. దేవగుడి ఆధిపత్య గ్రామాల్లో ఈ కుటుంబం వందలాది ఎకరాల కొండ ప్రాంతాన్ని ఆక్రమించి సొమ్ము చేసుకుంది.‘డైమన్షనల్’దందా టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈయనకు అడ్డూఅదుపూ లేదు. మైలవరం మండలంలోని కొండల్లో విలువైన, అరుదైన ఖనిజాలు లభిస్తాయి. అందులో డైమన్షనల్ స్టోన్ ఒకటి. ఆ రాయిని శిల్పాలు, దేవాలయాల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఒక్కొ టన్ను ధర రూ.వేలల్లోనే. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అక్రమంగా తరలించారు. రూ.కోట్లలో ఆర్జించారు.గ్రావెల్ అక్రమ రవాణా స్థానికంగా అడ్డుకునే వారు లేకపోవడంతో.. నియోజకవర్గ పరిధిలోని శిరిగేపల్లి, సున్నపురాళ్లపల్లె కొండల్లో రోడ్లకు ఉపయోగపడే గ్రావెల్ను ఈ మాజీ అమాత్యుని సమీప బంధువే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పొక్లెయినర్ల సాయంతో కొండలు, గుట్టల్ని పెకలించేశారు. క్రషర్ ద్వారా కంకరగా మార్చి సొమ్ము చేసుకున్నారు.పాలూరు ఎత్తిపోతల పథకం చేపట్టిన కోయా కంపెనీ, సుజిలాన్ పవర్ విండ్ ప్రాజెక్టుతోపాటు సోలార్ కంపెనీ యాజమాన్యం నుంచి ఎన్నికల ఖర్చుల పేరిట దందాల ఆరోపణలూ ఉన్నాయి. ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు ఎర్త్ పనులు ఈ కుటుంబం కనుసన్నుల్లోనే జరిగాయి. నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు పనులు జరిగితే, అందులో సగం సొమ్ము ఈయన సన్నిహితుల జేబులోకే వెళ్లినట్లు సమాచారం. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి
అంతర్జాతీయ విమానాశ్రయం... ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి సూచిక. సంబంధిత రాష్ట్రానికి ఐకానిక్ సింబల్. దేశ యవనికపై అదొక ప్రత్యేక ముద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశలో వేసిన అడుగులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. 2025 నాటికి తొలి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూసేకరణకు బీజం పడింది. కానీ అప్పటి ప్రభుత్వం అభూత కల్పనలు, భయాలు కలి్పంచి ఏకంగా 15 వేల ఎకరాలు అవసరమని ప్రచారం చేయించింది. రైతుల ఆందోళనలతో ఐదు వేల ఎకరాలకు దిగింది. ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. మరోవైపు భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో విచారణ పెండింగ్లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. దీన్ని తానే నిర్మించానని చెప్పుకోవాలనే తహతహతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా టీడీపీ ముఖ్య నాయకుడు, కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ చిత్తశుద్ధి తేటతెల్లమైంది. మంత్రిగా ఉండి కూడా భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన అనుమతులనూ తీసుకురాలేకపోయారన్నది చర్చనీయాంశమైంది. –సాక్షి ప్రతినిధి, విజయనగరంప్రభుత్వం మారింది.. దశ తిరిగింది2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చంది. అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారు. డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేశారు. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వా«దీనంలోనున్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. మిగతా భూమిని ఐటీ సిటీ కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైవోవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యింది. రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వా«దీనంలోనున్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. మిగతా భూమిని ఐటీ సిటీ కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైవోవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యింది. విమానాశ్రయ స్వరూపంస్థాయి : అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం స్థలం : 2,750.78 ఎకరాలు ప్రభుత్వ భూమి : 422.69 ఎకరాలు కొనుగోలు చేసిన భూమి : 1,383.39 ఎకరాలు విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించింది : 2,203 ఎకరాలు రన్వే పొడవు : 3.8 కిలోమీటర్లు నిర్వాసిత కుటుంబాలు : 376 నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ వ్యయం : రూ.80 కోట్లు కేటాయించిన స్థలం : 25 ఎకరాలు ప్రత్యేకంగా విద్యుత్తు సబ్స్టేషన్ కోసం : 5.47 ఎకరాలు మొత్తం ఖర్చు : రూ.5వేల కోట్లు (అంచనా)చంద్రబాబు హయాం∗ 15 వేల ఎకరాలు అవసరమన్న ప్రచారం. ∗ రైతుల ఆందోళనతో ఐదు వేల ఎకరాలకు ప్రభుత్వం దిగొచి్చంది. ∗ భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల ∗ పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటన. ∗ అయినా కొలిక్కిరాని భూసేకరణ. ∗ నిర్వాసితులకు ఏం చేయబోతోందో చెప్పనే లేదు. ∗ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో రైతుల పిటిషన్. ∗ దాని సంగతి ఎటూ తేలలేదు. ∗ ఎన్నికలు సమీపించడంతో అంతా తానే చేశానని చెప్పుకోడానికి 2019శ్రీ ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టారు. జగన్ పాలనలో∗ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ∗ విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించింది ∗ 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. ∗ కేసులు వేసిన రైతుల డిమాండ్లనుపరిష్కరించింది. ∗ రెట్టింపు పరిహారం ఇచి్చంది. ∗ నిర్వాసితులకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్íÙప్ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలను నిర్మించింది. ∗ దాదాపు రూ.5 వేల కోట్లతో జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ∗ 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనేది లక్ష్యం.ఆర్థికాభివృద్ధికి ఊతం విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుంది. ఫుడ్, ఫార్మా, ఫిషరీ రంగాల ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు స్థావరంగా నిలుస్తుంది. ట్రావెల్, హాస్పిటాలిటీ, గోడౌన్, వేర్ హౌసింగ్ రంగాలు అభివృద్ధి చెందుతాయి. 6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సేవలు లేకపోవడం వల్లే విశాఖ పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగం పుంజుకోవడం లేదు. –కాపుగంటి ప్రకాశ్, పెసిడెంట్, చాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరంసీఎం జగన్కు రుణపడి ఉంటాం సీఎం జగన్ అధికారంలోకి వచి్చన తరువాత రైతులకు పూర్తి స్థాయి లో పరిహారం చెల్లించి, నిర్వాసితులకు గూడెపువలస, లింగాలవలస గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీలను ఏర్పాటు చేసింది. ఉద్యమ సమయంలో గత ప్రభుత్వం మాపై పెట్టిన కేసులను ఎత్తివేసింది. విమానాశ్రయ నిర్మాణంలో భూ ములు కోల్పోయిన రైతులు, గృహా లు కోల్పోయిన నిర్వాసితులందరం సీఎం జగన్కి రుణపడి ఉంటాం. – కొండపు ఎల్లయ్యమ్మ, నిర్వాసితురాలు, కవులవాడ సర్పంచ్శరవేగంగా నిర్మాణ పనులు... భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్వే పటిష్టంగా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో భూమి చదును చేస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం రూ.80 కోట్ల వ్యయంతో టౌన్షిప్లను తలదన్నేలా రెండు కాలనీలను ప్రభుత్వం నిరి్మంచింది. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. నిర్వాసిత గ్రామాల నుంచి గతంలో వలసపోయిన కుటుంబాలకూ మానవతా దృక్పథంతో ఇంటిస్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారిని ఆనుకొని 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. విమానాశ్రయ అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిరి్మంచనుంది. ఇందుకోసం ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ప్రత్యేకంగా విద్యుత్తు సబ్స్టేషన్ కోసం భోగాపురం మండలంలోని ముక్కాం రెవెన్యూ పంచాయతీ పరిధిలో 5.47 ఎకరాల భూమిని కేటాయించింది. -
అదే నా కల.. ఎప్పటికీ జనం గుండెల్లో బతికి ఉండాలి
‘అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ పేదల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని గట్టిగా నమ్ముతున్నా.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. నేను మరణించినా, ప్రజలగుండెల్లో బతికి ఉండాలన్నదే నా కల’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ను ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూ చేసింది.రాజ్దీప్: మీరు మళ్లీ గెలిస్తే విశాఖపట్నన్నిరాజధానిని చేసే విషయంలో మీరు కచ్చితమైన స్పష్టతతో ఉన్నారా? సీఎం జగన్: అమరావతి గురించి మాట్లాడే వారు రూ. లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారో చెప్పగలరా.. కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేదు. ఒక వేళ అమరావతి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం మొదలు పెడితే పది పదిహేనేళ్లు పడుతుంది. అప్పటికి ఈ లక్ష కోట్లు పది లక్షల కోట్లు అవుతుంది. రాజధాని అనేది కలగానే మిగులుతుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ నగరం. విశాఖలో ఇప్పటికే రహదారులు ఉన్నాయి. ఎయిర్పోర్టు ఉంది. మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు నుంచి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తే రాబోయే 5–10 సంవత్సరాలలో హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నైతో వైజాగ్ పోటీ పడడాన్ని మీరు నిజంగా చూస్తారు.రాజ్దీప్: మీరు 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి చంద్రబాబును చాలెంజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మీకు చాలెంజ్ చేస్తున్నారు. మీరు అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లడం గతంతో పోలిస్తే ఇది కఠినంగా అనిపిస్తోందా? సీఎం జగన్: సాధారణ పరిస్థితుల్లో అనిపించొచ్చు. కానీ, ఇక్కడ వాస్తవం ఏమంటే.. మేము ప్రజలకు సుపరిపాలన అందించాం. మా మేనిఫెస్టోలోని 99 శాతం వాగ్దానాలను త్రికరణ శుద్ధిగా అమలు చేసి చూపించాం. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష లేకుండా.. అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబి్ధదారుల ఖాతాల్లో జమ చేశాం. రాజ్దీప్: మీరు చాలా డబ్బు ప్రజలకు చేరిందని చెబుతున్నారు.. ఇలా నగదు బదిలీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు.. ఏపీలో నేరుగా రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఇలా క్యాష్ ట్రాన్స్ఫర్ కాకుండా.. ఉత్పాదక ఉపాధి కోరుకుంటున్న వాళ్లకి ఏం చెబుతారు? సీఎం జగన్: ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్దీప్.. కొందరిలో ఆ కన్ఫ్యూజన్ ఉంది. మేం చాలా సమగ్రమైన విధానాలను అనుసరించాం. రైతుల గురించే తీసుకుంటే.. ఏ విధంగా వ్యవసాయానికి భరోసా ఇచ్చామో తెలుస్తుంది. రాష్ట్రంలో 50 శాతం మంది అర్ధ హెక్టార్, 70 శాతం మంది ఒక హెక్టార్లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులున్నారు. ఇలాంటి వారందిరి కోసమే రైతు భరోసా ప్రవేశపెట్టాం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. మేము ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. రూ.67,500 ఇచ్చాం. ఇది రైతులకు 80 శాతం సాగు ఖర్చులుగా ఉపయోగ పడుతుంది. దీనికి తోడు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాన్ని పెట్టాం. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున సేవలు అందిస్తున్నారు. ప్రతి పథకం అవినీతి, వివక్ష లేకుండా క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుడి దగ్గరకు నేరుగా చేరుతోంది. సమస్త ప్రభుత్వ సేవలన్నీ పేదల ఇంటి ముంగిటనే నిలిచాయి. రాజ్దీప్: సంక్షేమ పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అందుకే కేంద్రం సాయం కోసం ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించాయి కదా? సీఎం జగన్: రాజ్దీప్.. మనం డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నామో చూడాలి. ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. పథకానికి ఏ పేరు పెట్టినా ఆ డబ్బు ఎవరికి వెళ్లి.. ఎంత మేలు చేసిందో చూసుకోవాలి. దీన్ని సామాజిక పెట్టుబడిగా చూడాలి. రాజ్దీప్: రాష్ట్రంపై రూ.4.42 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ డబ్బుల కోసమే మీరు కేంద్రంపై ఆధారపడ్డారా? సీఎం జగన్: ఇదంతా ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకే ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది. ఆ పరిమితులను దాటి ఏ రాష్ట్రం కూడా అప్పు చేయలేదు. రాజ్దీప్: నేరుగా డీబీటీతో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే మీరు తిరిగి మరోసారి అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారా? ఇదే మీ విన్నింగ్ కార్డు అనుకోవచ్చా? సీఎం జగన్: ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి.. ఎలా.. వెళ్లిందో చూడాలి. మేము ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్ మీడియంలోకి తీసుకొచ్చాం. ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో ఐఎఫ్పీ ప్యానల్స్ను పెట్టి డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రతి ఎనిమిదో తరగతి విద్యార్థి చేతిలో బైజ్యూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్లు పెట్టాం. ఇది సిలబస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా చూస్తే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తాయి. టోఫెల్ శిక్షణ కోసం ప్రత్యేక పీరియడ్ తీసుకొచ్చాం. ఇదంతా ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థుల కోసం జరుగుతోంది. 2025 విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ విద్యార్థి ఐబీ సిలబస్లో చదువుకుంటాడు. 2035 నాటికి మా పిల్లలు ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. ప్రతి ఏటా ఒక్కో తరగతికి ఐబీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి పేదవాడి భవితను మారుస్తోందనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.రాజ్దీప్: 81 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మీరు మార్చారు. వైఎస్సార్సీపీలో వన్ మ్యాన్ షో జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ అనే పేరు చెప్పి ఈ రోజున ఓట్లు అడుగుతున్నారు. ప్రాంతీయ పారీ్టలో ఇది హైరిస్క్ ఫార్ములా కాదంటారా? సీఎం జగన్: ప్రతి రాజకీయ పార్టీకి ఒక సొంత సర్వే ఉంటుంది. ఆ సర్వేల ప్రకారం ఈ రోజున మా ప్రభుత్వం మీద, సీఎంగా నా మీద ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇది రియాలిటీ. అందుకే నేను చాలా నమ్మకంగా ఉన్నాను. రాజ్దీప్: అందుకేనా జగన్ పేరిటే ఓట్లు అడుగుతున్నారు? సీఎం జగన్: అవును. నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలకు ఒకటే చెబుతున్నా. ప్రస్తుతం జరుగుతున్నవి ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని వివరిస్తున్నా. ‘మీ భవిష్యత్ జగన్తో ఉంటే భద్రంగా ఉంటుంది. జగన్ ద్వారానే మీ భవిష్యత్ మంచి మలుపు తిరుగుతుంది’ అంటేనే వైఎస్సార్సీపీకి ఓటేయమని అడుగుతున్నా. అంతేకాదు.. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినట్లయితేనే, మంచి పరిపాలన అందించారని భావిస్తేనే ఓటేయాలని అడుగుతున్న ఏకైక పార్టీ కూడా వైఎస్సార్సీపీ. రాజ్దీప్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మీ సొంత చెల్లి షర్మిల ఇలా అందరూ అటు వైపు ఉంటే మీరొక్కరే ఇటువైపు ఉన్నారు. వాళ్లందరూ ఒక్కటిగా వస్తున్నారు. ఇది మీకు ఇబ్బందికరంగా లేదా? సీఎం జగన్: గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన నేను అందించాను. మంచి చేశాను కాబట్టే నేను ధైర్యంగా ఒంటరిగా ప్రజల్లోకి వెళుతున్నాను. ప్రజలకు కూడా నాపై నమ్మకం ఉంది. నన్ను ఒంటరిగా ఎదుర్కోడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అందుకే గుంపులుగా వస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 50 శాతం పైగా ఓట్లు ఎవరికి వస్తే వాళ్లు విజయం సాధిస్తారు.రాజ్దీప్: అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేసేందుకు చాలా కష్టపడ్డానని, ఎంతో ఖర్చు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ మీరు మూడు రాజధానులు మా విధానం అంటున్నారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో స్ట్రక్ అయ్యింది. శాశ్వత రాజధాని లేకుండా పరిపాలన ఎలా? రైతుల నుంచి భూములు తీసుకుంటే ప్రస్తుత సీఎం వాటిని వెనక్కు ఇచ్చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. సీఎం జగన్: అమరావతి ఎక్కడుంది.. అమరావతి అంటే ఏమిటనేది ముందుగా మనం ఆలోచించాలి. అమరావతి.. గుంటూరు, విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 వేల ఎకరాల భూ సమీకరణ జరిగింది.‡ అదంతా మూడు పంటలు పండే భూమి. అమరావతి రాజధాని అనేది ఒక కుంభకోణం. తన సన్నిహితులు ముందే భూములు కొనుగోలు చేసేశాక అప్పుడు చంద్రబాబు అక్కడ రాజధానిని డిక్లేర్ చేశారు. రహదారులు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే వారి సొంత నివేదిక ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. అంటే మొత్తంగా రూ. లక్ష కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బును రాష్ట్రం ఎక్కడి నుంచి తెస్తుంది? రాజ్దీప్: జగన్పై రాయితో దాడి చేయడం అనేది పూర్తిగా ఓ డ్రామా అని, అదంతా సింపతీ కోసం జగనే క్రియేట్ చేసుకున్నాడని చంద్రబాబు అంటున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారని, జగన్ ఆంధ్రాలో డిక్టేటర్గా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.. సీఎం జగన్: ఎవరి ద్వారా ఈ రాయి వచ్చింది? వాళ్ల మనుషుల ద్వారానే వచ్చింది. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ చంద్రబాబు నిలబడి, అదే వేగంతో అదే రాయితో కొట్టించుకుని, మూడు కుట్లు వేయించుకోమనండి. ఆయనకూ సింపతీ వస్తుంది.రాజ్దీప్: పాత కేసుల్లో సీఐడీని వాడి చంద్రబాబును జైలుకు పంపారని, జగన్ శత్రువులను, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను ఈ విధంగా వేధిస్తారనే వాదన ఉంది. సీఎం జగన్: ఎవరు తప్పు.. ఎవరు ఒప్పు అనేది న్యాయస్థానం పెట్టే పరీక్షలో తేలుతుంది. చంద్రబాబుని 52 రోజులు జైలుకు పంపడం సరైనదేనని కోర్టులు భావించాయి. అంటే అతను ఏదో చేశాడనే కదా అర్థం. బెయిల్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది ఏదో సమయంలో వస్తుంది. నిజం ఏంటంటే ఆ కుంభకోణం జరిగిందనడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయి.రాజ్దీప్: ఎన్నికల అనంతరం కేంద్రంతోనూ, ప్రధానితోనూ మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అభివృద్ధి కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు అంటున్నారు. సీఎం జగన్: ప్రస్తుతం చంద్రబాబు, మోదీ పొత్తులో ఉన్నారు. వారు పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి కోసమా.. అదే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటే అది ఇంకోదానికోసమా?రాజ్దీప్: సర్వశక్తులు ఒడ్డుతున్న వారితో పోరాటంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నదేమిటి? సీఎం జగన్: అణగారిన వర్గాలు, నిరుపేదల జీవితాలను మార్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను గట్టిగా నమ్ముతాను. దాని కోసం దేవుని దయ వల్ల నేను ఏం చేయగలనో అది చేస్తున్నాను. నాకు కావాల్సింది.. నా కల ఒక్కటే. నేను మరణించినా ప్రజల గుండెల్లో బతికుండాలి. రాజ్దీప్: ఇంగ్లిష్ మీడియం విద్య, ఐబీ, ఇలాంటి విప్లవాత్మక మార్పులన్నీ గ్రామ స్థాయిలో సాధ్యం అవుతాయా? క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయని అందరూ అంటున్నారు.. సీఎం జగన్: ఎవరు అంటున్నారు? ఈ రోజు మీరు ఒక గ్రామానికి వెళ్లండి. మార్పు మీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఈ సచివాలయం ద్వారా ప్రజలకు గ్రామ స్థాయిలోనే 600 రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 60, 70 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటున్నారు. వీళ్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామస్తుడి చేయి పట్టి ముందుకు నడిపే కార్యక్రమం చేస్తున్నారు. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు ముందుకు వెళితే ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ బడి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు పోతే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. ఇవన్నీ గ్రామ స్థాయిలో అభివృద్ధికి తార్కాణాలు. గతంలో ఇవన్నీ ఎక్కడా మనకు కనిపించేవి కాదు. ప్రభుత్వం లేదా ఒక పెద్ద పరిశ్రమ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యపడదు. ఎకానమీని డ్రైవ్ చేసే ఎంఎస్ఎంఈలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్లను మేం ప్రోత్సహించాం. ఈ రోజున 62 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అదే విధంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలు, మత్స్యకారులు, స్ట్రీట్ వెండర్స్, బార్బర్స్, టైలర్లు, ఆటో డ్రైవర్లు వీళ్లంతా రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. ఈ క్రమంలో వీరందరికీ బ్యాంక్లు, వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతగా నిలిచాం. రాజ్దీప్: మీరేమో అవినీతి లేదంటున్నారు? ప్రతిపక్ష నేత చంద్రబాబు భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.. సీఎం జగన్: చంద్రబాబు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి అలా మాట్లాడుతున్నారు. మీరే నేరుగా ప్రజల దగ్గర మైక్ పెట్టి అడగండి. మేము చెప్పిన హామీలు, పథకాలతో ఎంత ఆరి్థక మేలు జరిగిందో చెబుతారు. పైస్థాయిలో నేను చెప్పిన ప్రతి రూపాయి కింది స్థాయిలోని లబి్ధదారులకు నేరుగా చేరింది. సంక్షేమ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా కోట్ల రూపాయలు లబి్ధదారుల ఖాతాల్లో పడుతుంటే అవినీతి, వివక్ష ఎక్కడ ఉంటుంది? రాజ్దీప్ : ఈ ఎన్నికల్లో మీ సోదరి మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇది ప్రతిష్టకు భంగంగా భావిస్తున్నారా? సీఎం జగన్: ఆమె డిపాజిట్ కోల్పోతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఏ పార్టీ అయితే నా తండ్రి పేరును సీబీఐ చార్జ్ షీట్లో చేర్చిందో.. ఏ పార్టీ అయితే కలి్పత కేసులను నాపై పెట్టిందో అందరికీ తెలుసు. అవి కాంగ్రెస్, టీడీపీలు. ఈ రోజు నా సోదరిని ఎవరు నడిపిస్తున్నారో తెలుసా.. రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. బీజేపీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. ఈ రోజు జగన్ ఫైట్ చేస్తోంది కేవలం ఒక్క బీజేపీతోనే కాదు. కాంగ్రెస్తో కూడా.రాజ్దీప్: కేంద్రంలో అధికారం కోసంమోదీకి సీట్లు తగ్గితే మీరు 20 ఎంపీ సీట్లతో సపోర్ట్ చేస్తారా? సీఎం జగన్: ఊహాజనిత పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడటం.. ఇప్పుడు వారు నేను ఒకరికొకరం వ్యతిరేకంగా పోరాడుతున్నాం. -
కేంద్రం టైటిల్తో బాబు డ్రామా
అమలులోకి రాని చట్టంపైఇంత దుష్ప్రచారమెందుకు? ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్రం స్పష్టంగా అన్ని రాష్ట్రాలకూ చెబుతున్న నేపథ్యంలో.. జనానికి నచ్చినా, నచ్చకపోయినా.. బలవంతంగానైనా దాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఎవరి హయాంలో ఉంటుంది? బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. ఎన్డీఏతో కూటమి గట్టిన చంద్రబాబు నాయుడి హయాంలోనే కదా? ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగాఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ చట్టాన్ని ప్రజల ఇష్టాయిష్టాల మేరకు అమల్లోకి తేవటమో, తేకుండా నిలిపేయటమో ఏదైనా చేయగలరు. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు కదా! బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్నారు గనక.. ఎన్డీఏ పేరుతో ఓట్లడుగుతున్నారు కనక.. ప్రజలకు ఇష్టం ఉన్నా, లేకున్నా చచ్చినట్టు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలి. ఇది వాస్తవం. ఇది పచ్చి నిజం. మరి దొంగ మాటలెందుకు చంద్రబాబూ? పైపెచ్చు అమల్లోకి రాని ఈ చట్టాన్ని రద్దు చేస్తాననే ఓ పిచ్చి హామీని మేనిఫెస్టోలో పెట్టారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీ మానసిక స్థితి సరిగానే ఉందా? అసలు అమల్లోకే రాని ఈ చట్టంపై ఉన్నవీ లేనివీ చెబుతూ...దాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేసిందని, అందరి భూములూ లాక్కుంటోందని దిగజారిపోయి దౌర్భాగ్యపు ప్రచారానికి దిగటం ఎంత నీచం? ఈ చంద్రబాబు నాయుడి నైచ్యానికి అంతూ పొంతూ ఉండదా? మనిíÙగా పుట్టాక కాస్తయినా సిగ్గూ శరం ఉండాలి కదా? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెబుతున్న ఈ పెద్ద మనిíÙ.. ఇంత కుళ్లూ కుతంత్రాలతో.. జనం సాక్షిగా కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పేస్తూ విషం కక్కుతుండటం హేయం కాదా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి పునాది పడింది 1989లోనే. భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకటానికి, ఎవరి పేరుతో భూమి ఉందో వారి పేరిట టైటిల్ ఇచ్చి.. ఆ టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలా చట్టాన్ని చేయాలని, దీనికోసం ల్యాండ్ రికార్డులన్నిటినీ డిజిటల్ చేయాల్సి ఉంటుందని అప్పట్లోనే తీర్మానించారు. ఆ తీర్మానాలకు కొనసాగింపుగా.. 2004లో జాతీయ ల్యాండ్ రికార్డుల కంప్యూటరీకరణ (ఎన్ఎల్ఆర్ఏపీ) పథకాన్ని రూపొందించారు.దాని ప్రకారం 2009లో తొలి మోడల్ చట్టం తయారైంది. ఈ మోడల్ చట్టాన్ని అనుసరిస్తూ 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. దానికి కొన్ని సవరణలు చేస్తూ 2015లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. అదిగో ఆ తర్వాతే...అంటే 2015లో ముసాయిదా తెచ్చాకే కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ దీనికో రోడ్ మ్యాప్ ఇచ్చింది. టైటిల్ గ్యారంటీకి ఏమేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలమనే రోడ్డు మ్యాప్ అది. ఆ రోడ్ మ్యాప్కు తగ్గట్టుగానే 2019లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ ముసాయిదాకు అనుగుణంగా.. ఈ చట్టాన్ని తేవాలంటే రాష్ట్ర భూముల సర్వేను పూర్తి చేయటం తప్పనిసరి కనక... ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రీ సర్వే పూర్తయితేనే ‘ల్యాండ్ టైట్లింగ్’ వాస్తవానికి రాష్ట్రంలో 17,000 గ్రామాలుండగా వాటిలో ఇప్పటికే 6 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. రీ సర్వే జరిగి.. ఆ సందర్భంగా తలెత్తే వివాదాలన్నీ పరిష్కారం కావటానికి చాలా సమయం పడుతుంది. అదంతా పూర్తయ్యాక, రీ సర్వేలో పేర్కొన్న వ్యక్తులకు భూ హక్కు పత్రాలిస్తారు. ఆ పత్రాల ఆధారంగానే.. ప్రతి ఒక్కరికీ ఆయా భూముల టైటిల్ను వారి పేరిట మంజూరు చేస్తారు. అంటే.. రీ సర్వే పూర్తి కాకుండా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తేవటం అసాధ్యం. రీ సర్వే పూర్తయి.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే... భూములపై సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలు, ఇవేవీ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ వాస్తవం. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అవసరమా? నిజానికిప్పుడు భూమికి సంబంధించి రకరకాల పత్రాలుంటున్నాయి. 10(1), అడంగల్ వంటివి రెవెన్యూ విభాగం ఇచ్చేవి. ఇక రిజిస్ట్రేషన్ శాఖ విషయానికొస్తే ఆ శాఖ రిజిస్టరైన ప్రతిసారీ ఒక డాక్యుమెంట్ నెంబరు కేటాయిస్తుంది. అంతేకాదు.. సర్వే సెటిల్మెంట్, ఎండోమెంట్, అటవీ శాఖ, వక్ఫ్, స్థానిక సంస్థలు.. వీటన్నిటి వద్దా ఒకే భూమికి సంబంధించి వేర్వేరు రికార్డులు ఉంటున్నాయి. ఆ భూమిని ఒకరు కొన్నప్పుడో, అమ్మినప్పుడో అన్ని రికార్డుల్లోనూ ఒకేసారి నమోదయ్యే అవకాశం లేదు.దీంతో కొన్ని రికార్డుల్లో ఆ లావాదేవీలు నమోదవుతాయి. కొన్ని రికార్డుల్లో నమోదు కావటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక భూమిని కొన్నాక... రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాక... వేరెవరో వచ్చి అది తాను ముందే కొన్నానని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాక... అది అసైన్డ్ భూమి అనో, గ్రామ కంఠం భూమి అనో, లేదా చుక్కల భూమి అనో తెలుస్తోంది. ఒక భూమికి సంబంధించిన రికార్డులు పలు చోట్ల పలు రకాలుగా ఉండటం వల్ల వస్తున్న సమస్య ఇది. ఇక రుణాల సంగతి తీసుకుంటే.. ఒక బ్యాంకు దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకుంటే ఆ సమాచారం రిజి్రస్టార్ కార్యాలయంలో అప్డేట్ కాదు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు పోయాయని చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకుని దాని ఆధారంగా మరోసారి రుణం తీసుకోవటమో, రుణం తీçర్చకుండానే ఆ భూమిని అమ్మేయటమో జరుగుతోంది. నిజంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలçకు ఆస్కారం ఉండదు. అన్ని రికార్డులూ ఒకే రిజిస్టర్లో... ల్యాండ్ టైట్లింగ్ చట్టం వస్తే... టైటిల్ రిజిస్టరులో ప్రతి భూమికీ ఒక యునిక్ నంబరును (రీ సర్వేలో పేర్కొన్న మేరకు) కేటాయిస్తారు. ఆ రిజిస్టరు భూములతో సంబంధం ఉండే ప్రతి విభాగానికీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రతి బ్యాంకుకూ, ఆర్థిక సంస్థకూ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయా సంస్థలు తామిచ్చే రుణాలతో సహా ఆ భూమికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ ఆ రిజిస్టరులో నమోదు చేస్తాయి. కాబట్టి తదుపరి మోసాలకు, వివాదాలకు తావుండదు. అందుకే ప్రభుత్వ గ్యారంటీ మోసాలకు తావుండదు కనక.. ఈ చట్టం ప్రకారం ప్రతి భూమికీ ప్రభుత్వం ఆయా టైటిల్ దారు పేరిట బీమా చేయిస్తుంది. కాబట్టి ఊహించని పరిస్థితుల్లో ఆ భూమి తనదంటూ వేరెవరైనా వివాదం తెచ్చినా... ఒకవేళ అది ఏ అసైన్డ్ భూమో అని తేలినా.. టైటిల్ దారుకు ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. అంటే ఆ టైటిల్దారుకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందన్న మాట. ఇదీ చంద్రబాబు సహా ఎల్లో ముఠా ఎక్కడా చెప్పని పచ్చి నిజం.మోదీతో చెప్పించు బాబూ? అసలు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తయారు చేసింది కేంద్రమే కదా? దానిపై వివిధ రాష్ట్రాలతో కమిటీ వేసి మరీ.. తగిన మార్గదర్శకాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ‘నీతీ ఆయోగ్’ కదా? ఆ కమిటీ నివేదిక మేరకు.. దానికి రకరకాల ముసాయిదాలు రూపొందించి.. దాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపించింది అబద్ధమా? దానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా చేయటం అబద్ధమా? ఆ కోవలోనే కదా! ఈ చట్టం తేవాలంటే ముందుగా రాష్ట్రం మొత్తాన్ని రీ సర్వే చేయాల్సి ఉంటుంది కనక ఆ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంత మాత్రానికే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చేసిందంటూ అన్ని భూములనూ జగన్ ప్రభుత్వం తన పేరిట రాసేసుకుంటోందని చెబుతూ ఎన్నికల ముందర చంద్రబాబు, ఆయన పచ్చ ముఠా వికృత క్రీడ మొదలు పెట్టింది. లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయటం లేదు. బీజేపీతో, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. పైపెచ్చు రాష్ట్రంలో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీనీ పిలిపిస్తోంది.ఇప్పటికే ఒకసారి ప్రచారం చేసి వెళ్లిన నరేంద్ర మోదీ.. త్వరలో మళ్లీ రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఆ రోజున ప్రధాన మంత్రి ముందే ఈ చట్టాన్ని మేం అమలు చేయబోమని చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టాన్ని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయబోమని మోదీతో చెప్పించగలవా? ల్యాండ్ టైట్లింగ్ అంటూ ఊగిపోతున్న పవన్ కల్యాణ్.. మోదీ ముందు అదే నటనను కొనసాగించగలరా? ఎన్నాళ్లీ పనికిమాలిన డ్రామాలు?ఇదీ... ఎల్లో ముఠా సాగిస్తున్న విష ప్రచారం 1. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూములన్నీ లాగేసుకుంటారు. రాత్రికి రాత్రి ఆన్లైన్లో రికార్డులను మార్చేస్తారు. 2. సివిల్ కోర్టులకు ఇక భూములపై అధికారాలు ఉండవు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి గానీ, రెవెన్యూ శాఖ ఎలా ఇస్తుంది.. 3. భూములకు సంబంధించిన అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారు.. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, అధికార పార్టీ వాళ్లు చెప్పిన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారు. 4. ఈ చట్టం వచ్చాక భూములున్న వారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అసలు వాస్తవాలు ఇవీ.. 1. ప్రభుత్వం భూములెలా లాక్కుంటుంది? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గిరిజనులకు 3.22 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం కలలోనైనా ఇలాంటి ఆలోచన చేస్తుందా? నిజానికి రీసర్వే చేసేటపుడే ఆ భూమి ఎవరిదో తేల్చి.. వారి పేరిట హక్కు పత్రాలు ఇస్తోంది. ఆ హక్కుదారు పేరే కదా రికార్డుల్లో ఉంటుంది. మరి ఆ పేరును మార్చేయటం సాధ్యమా? రాత్రికి రాత్రి ఆన్లైన్లో ఎలా మార్చేస్తారు? మన పేరిట హక్కు పత్రం ఇచ్చినపుడు...ఆ పత్రం మనదగ్గర ఉన్నపుడు రికార్డుల్లో మన పేరు మార్చేయటం ఎలా సాధ్యం? ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఇది తెలిసిపోతుంది కదా! 2. రికార్డుల్లో జరిగే తప్పులపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నది తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు ప్రభుత్వ అధికారులకే కదా? వీళ్లతో పాటు ఉండే టైటిల్ రిజి్రస్టారు కూడా ప్రభుత్వాధికారే ఉంటారు. దీన్లో తప్పేముంది? ఇక భూమి యాజమాన్యంపై వచ్చే సివిల్ వివాదాలు ఇప్పటి మాదిరే కోర్టుల్లోనే పరిష్కారమవుతాయి. దీన్లో ఎలాంటి తేడా ఉండదు. మరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనటం పచ్చి అబద్ధం కాదా? 3. అన్ని అధికారాలూ టైటిల్ రిజి్రస్టారుకు ఎందుకుంటాయి? ఇప్పుడు భూముల రిజిస్టరు సబ్ రిజి్రస్టారు కార్యాలయంలో ఉంటోంది. ఆయన కూడా ప్రభుత్వాధికారే. మరి ఆయన ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పినట్లు రికార్డుల్లో పేర్లు మార్చేయగలుగుతున్నారా? ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేయగలుగుతున్నారా? రికార్డుల్లోని వివరాల నిర్వహణకు ప్రభుత్వం నియమించే గుమాస్తాగానే ఆయన్ను చూడాలి తప్ప.. రికార్డులు మార్చే అధికారం తనకు ఎందుకుంటుంది? 4. మళ్లీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? అసలు ఆ అవసరం ఎందుకుంటుంది? వివిధ కార్యాలయాల్లో ఉండే వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించి.. రీ సర్వేలో ఇచ్చిన హక్కు పత్రాల ఆధారంగా రిజిస్టరులో ప్రభుత్వమే నమోదు చేసుకుంటుంది. మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. -
మరింత పెరగనున్న ఎండలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు బుధవారం నుంచి తీవ్రతరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరింత ఉధృతం కానున్నాయి.కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
నేను లేక.. మీరుండలేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Advertisement