లారీ ఢీకొని వ్యక్తి మృతి | One dead and One injured in Road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Dec 17 2015 4:24 PM | Updated on Aug 30 2018 3:56 PM

బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు.

కొవ్వూరు రూరల్ (పశ్చిమ గోదావరి) : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన పెద్దాడ శ్రీనివాస్ గౌరీపట్నంలో జరిగే మేరీమాత ఉత్సవాలకు వెళ్తున్నాడు.

కుటుంబసభ్యులు ముందుగా బస్సులో వెళ్లిపోగా మేనల్లుడితో కలసి శ్రీనివాస్ బైక్‌పై బయలుదేరాడు. కాగా వారి వాహనాన్ని దొమ్మేరు గ్రామ సమీపంలో వెనుక నుంచి  వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా అతని మేనల్లుడికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement