‘‘ఒలింపిక్’ వ్యవహారాన్ని మీరే తేల్చండి’ | olympic case given to single jadge | Sakshi
Sakshi News home page

‘‘ఒలింపిక్’ వ్యవహారాన్ని మీరే తేల్చండి’

Apr 22 2015 4:20 AM | Updated on Mar 23 2019 9:06 PM

‘‘ఒలింపిక్’ వ్యవహారాన్ని మీరే తేల్చండి’ - Sakshi

‘‘ఒలింపిక్’ వ్యవహారాన్ని మీరే తేల్చండి’

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు వ్యవహారాన్ని హైకోర్టు ధర్మాసనం తిరిగి సింగిల్ జడ్జికే నివేదించింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు వ్యవహారాన్ని హైకోర్టు ధర్మాసనం తిరిగి సింగిల్ జడ్జికే నివేదించింది. అన్ని వర్గాల వాదనలు విని, వచ్చేవారం నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. మరోవైపు సింగిల్ జడ్జి వద్దే వాదనలు వినిపించాలని విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసిసోయేషన్, ఆంధ్రప్రదేశ్ (రెసిడ్యూరీ) ఒలింపిక్ అసోసియేషన్‌లకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement