‘ఐదేళ్ల పాలనలో మీరు చేసిందేమిటి’ | MVS Nagireddy Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఐదేళ్ల పాలనలో మీరు చేసిందేమిటి’

Mar 26 2019 4:25 PM | Updated on Jul 6 2019 12:58 PM

MVS Nagireddy Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో చేసిందేమిటని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు గత 9ఏళ్లలో ఏ రోజైనా ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టారా అని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ హయాంలో మొదలుపెట్టిన 54 ప్రాజెక్ట్స్‌లో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ చంద్రబాబును విమర్శించారు. ఈ ఐదేళ్లపాలనలో మీరుచేసిందేమిటని.. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్‌ అయినా పూర్తి చేశారా అంటూ మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు ఇస్తున్నామంటూ హడావిడి చేస్తున్న బాబు.. అధికారికంగా ఎన్ని ఇచ్చారో చెప్పగలరా అంటూ సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement