ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కొనకొళ్ల | MP konakolla Narayana rao elected as AP gouda community | Sakshi
Sakshi News home page

ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కొనకొళ్ల

Dec 24 2014 7:08 AM | Updated on Aug 18 2018 8:05 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడుగా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు కొనకొళ్ల నారాయణరావు ఎన్నికయ్యారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడుగా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు కొనకొళ్ల నారాయణరావు ఎన్నికయ్యారు. రెండు రోజల కిత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంట్లో జరిగిన సమావేశంలో కొనకొళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అఖిల భారత గౌడ సంఘం చైర్మన్ పీఎస్ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం అధ్యక్షుడిగా కొనకొళ్ల పేరును కేఈ ప్రతిపాదించగా, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, గౌతు శ్యాంసుందర శివాజీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీహెచ్ వేణుగోపాలకృష్ణ ఆమోదం తెలిపారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement