ఆందోల్ మండలం జోగిపేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసింది.
మెదక్ : ఆందోల్ మండలం జోగిపేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసింది. పద్మ అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వారి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
కన్న పిల్లలను చంపి, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణాలు తెలియలేదు.