ఆస్పత్రిలో తల్లీ , బిడ్డ మృతి


తూర్పుగోదావరి : వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, అప్పుడే పుట్టిన మగ శిశువు మృతిచెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. రంగంపేట గ్రామానికి చెందిన గర్భిణి.. కోశెట్టి నాగమణి సోమవారం ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను 108లో  పెద్దాపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు తల్లీ, బిడ్డ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.



దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. పుట్టిన బిడ్డకు సరైన వైద్యం అందకపోవడంతోనే చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తల్లీ, బిడ్డ మృతి చెందారని వారు ఆరోపించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top