'తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరిని పరిరక్షించాలి' | mokshadaayani godhavari says vijayendra sarasvathi | Sakshi
Sakshi News home page

'తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరిని పరిరక్షించాలి'

Jul 1 2015 8:00 PM | Updated on Sep 3 2017 4:41 AM

సప్త నదుల్లో గోదావరి అత్యంత మోక్షదాయకమైనదని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు.

విజయవాడ: సప్త నదుల్లో గోదావరి అత్యంత మోక్షదాయకమైనదని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. గోదావరి పుష్కరయాత్రలో భాగంగా బుధవారం ఆయన విజయవాడలోని లబ్బీపేటలో శారదాచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానానికి వచ్చారు. ఈ సందర్భంగా 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. గోదావరి గురించి వివరిస్తూ...రుగ్వేదంలో దాని గొప్పతనం కనిపిస్తుందన్నారు. పంచభూతాల్లో జలం ప్రధానమైనదని, దానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా భక్తిశ్రద్ధలతో చేయాలని హితవు పలికారు. గంగానది పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేసినట్లే గోదావరి పరిరక్షణకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement