మోదీని తిట్టే ధైర్యం లేక మాపై విమర్శలా.. | MLA Roja slams tdp leaders over their criticism on ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

మోదీని తిట్టే ధైర్యం లేక మాపై విమర్శలా..

May 11 2017 5:00 PM | Updated on Oct 29 2018 8:10 PM

మోదీని తిట్టే ధైర్యం లేక మాపై విమర్శలా.. - Sakshi

మోదీని తిట్టే ధైర్యం లేక మాపై విమర్శలా..

తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని తిట్టేందుకు ధైర్యం చాలక తమ పార్టీ అధినాయకుడిపై విమర్శలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని తిట్టేందుకు ధైర్యం చాలక తమ పార్టీ అధినాయకుడిపై విమర్శలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయానన్న భయం చంద్రబాబును ఇంకా వెంటాడుతోందని చెప్పారు. మంత్రి నారాయణ కుమారుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో.. తెలుగుదేశం పార్టీ నేతలు జగన్‌ను విమర్శించడంలో బిజీగా ఉన్నారని, వాళ్ల తీరు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని ఆమె చెప్పారు.

ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి మోదీని జగన్ కలిస్తే.. తెలుగుదేశం పార్టీ నేతలకు ఎందుకంత ఉలికిపాటని రోజా ప్రశ్నించారు. చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకునే రకం కాదని, జగన్ స్వయంగా పట్టపగలే ఎంపీలతో కలిసి వెళ్లి చంద్రబాబు అవినీతిపై ప్రధానికి అన్ని ఆధారాలు ఇచ్చారని ఆమె చెప్పారు. అమెరికాలో ఉన్న చంద్రబాబు టెన్షన్‌తో ఏం చేయాలో తెలియక తమ పార్టీ నేతలతో దీనిపై విమర్శలు చేయిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement