చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలి | mla ravindranath reddy demands re-open sugar factory | Sakshi
Sakshi News home page

చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలి

Aug 25 2014 12:03 PM | Updated on Aug 18 2018 5:15 PM

వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు మండలంలోని సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో కోరారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు మండలంలోని సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో కోరారు. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో 13 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి ఉన్నారన్నారు. చక్కెర కర్మాగారం ఉద్యోగులకు మూడేళ్లుగా జీతాలు కూడా చెల్లించటం లేదని, వారు దుర్భర పరిస్థితిలో ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటికైనా తక్షణం రైతులను ఆదుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement