బాబు నీచ రాజకీయాలు మానుకోవాలి

MLA Malladi Vishnu Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు నీచ రాజకీయాలు మానుకోవాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బుధవారం విజయవాడలోని గాయత్రీ కన్వెన్షన్ హాలులో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను మల్లాది విష్ణు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం వైఎస్ జగన్ దేశంలోనే ముందుచూపు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top