టీడీపీ ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసింది

Minister Adimulapu Suresh Slams TDP Over IIITs - Sakshi

సాక్షి, కృష్ణా : గత తెలుగు దేశం ప్రభుత్వం రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 158 కోట్ల ట్రిపుల్ ఐటీ నిధులను చంద్రబాబు ప్రభుత్వం "పసుపు-కుంకుమ" పథకం కోసం ఖర్చుచేసిందని తెలిపారు. నిధులు తిరిగి వెనక్కి వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి  పూర్తి స్థాయిలో మరింత ఆధునీకరిస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top