రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. ఆర్థిక శాఖ ఆమోదం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) పరిధిలో, విశాఖ, తిరుపతి ల్లో ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు ప్రాజెక్టుల కీలకమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎంఆర్సీ మాజీ ఎండీ శ్రీధరన్ ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు పనిచేసేందుకు ఇటీవలే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతలను కూడా డీఎంఆర్సీకే అప్పజెపితే బావుంటుందన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఇందుకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్టీఎస్)లో భాగంగా విజయవాడ (వీజీటీఎం పరిధి), విశాఖపట్నం నగరాల్లో 4 కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో వీజీటీఎం పరిధిలో 49 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు నిర్మించనున్నారు.
వీజీటీఎం, విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్లకు చైర్మన్లు, డెరైక్టర్లను గత నెల 13వ తేదీనే ప్రభుత్వం నియమించింది. వీటితోపాటు తిరుపతి నగరంలోనూ ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నగరాల్లో ఎక్కువ జనాభా, రద్దీ (ట్రాఫిక్) ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు తొలి అడుగుగా భావించే డీపీఆర్ బాధ్యతలను డీఎంఆర్సీ చేపట్టనుంది. ఈ సంస్థ మూడు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు రూట్ మ్యాప్, స్థల సేకరణ, భూసార పరీక్ష (సాయిల్ టెస్టింగ్), ప్రాజెక్టు అంచనా వ్యయం తదితరమైనవన్నీ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక వచ్చాకే పనులు మొదలవుతాయి. ఇందుకోసం డీఎంఆర్సీ అధికారుల బృందం త్వరలోనే మూడు నగరాలకూ వస్తుందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి మెట్రో రైలు హైదరాబాద్ తరహాలో ఉంటుందా లేక ఢిల్లీ తరహాలోనే భూగర్భంలో నిర్మిస్తే బావుంటుందా అన్నది కూడా డీఎంఆర్సీ అధికారులు వారి నివేదికలో తెలుపుతారని చెప్పారు. గతంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తిరుపతి మెట్రో రైలు ప్రస్తావన లేకపోయినా, దీనికి కూడా ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసుకోవాలని, ఆ తర్వాత పరిస్థితినిబట్టి ఇక్కడ ప్రాజెక్టును చేపట్టాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
‘మెట్రో’ నివేదిక బాధ్యత డీఎంఆర్సీకి
Published Wed, Sep 10 2014 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement