-
అనిల్ అంబానీ అదృష్టం తారుమారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది. -
ప్రయాణికులు అలాంటి దుస్తుల్లో రావద్దు.. ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఓ యువతి టు పీస్ బికినీ టైప్ దుస్తులు ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన చేసింది. రైలులో ప్రయాణించేవారు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు మెట్రోలో ఇతరులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా అన్పించే దుస్తులు ధరించవద్దని యాజమాన్యం సూచించింది. తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. సమాజానికి ఆమోదయోగ్యమైన వేషధారణలో ప్రయాణించాలని తెలిపింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించింది. 'మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు వేషధారణ మంచిగా ఉండాలని ప్రయాణికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసిన యువతి పేరు రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది. తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది. చదవండి: దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్లో.. -
ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి
న్యూఢిల్లీ: బ్యాంకులో తనఖా పెట్టి.. 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న ప్రాపర్టీని.. మాయమాటలు చెప్పి.. మరో వ్యక్తికి ఏకంగా 5 కోట్ల రూపాయలకు అంటగట్టారు నిందితులు. ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఓ ఎంపీ కావడం విషేశం. నిందితులను అరెస్ట్ చేశారు ఆర్థిక నేరాల విభాగం అధికారులు. ఆ వివరాలు.. ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మకు నాలుగేళ్ల క్రితం నిందితుడు వినోద్ కుమార్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ ఢిల్లీలో తనకు ఓ ప్రాపర్టీ ఉందని.. దాని విలువ సుమారు 5 కోట్ల రూపాయలుంటుందని తెలిపాడు. ఆ ప్రాపర్టీని ఢిల్లీ మెట్రో రైల్వై ప్రాజెక్ట్ లీజుకు తీసుకుందని.. నెలకు 8-9 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుందని నమ్మబలికాడు. (చదవండి: చందమామపై ఇల్లు 289 కోట్లే!) వినోద్ మాటలు నమ్మిన అనురాగ్.. అతడు చెప్పిన మేరకు 5.6 కోట్ల రూపాయలు చెల్లించి 2017, ఫిబ్రవరి 21న కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అసలు మోసం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే అనురాగ్కు ప్రాపర్టీని అమ్మడానికి ముందే వినోద్ దాని మీద కెనరా బ్యాంక్లో 20.2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీ మీద కెనరా బ్యాంక్ అనేక చార్జీలు విధించినట్లు తెలుసుకున్నారు. (చదవండి: ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్!) అంతేకాక ప్రాపర్టీని అనురాగ్ శర్మకు అమ్మిన తర్వాత నిందితుడు.. ఆ విషయాన్ని దాచిపెట్టి డీఎంఆర్సీతో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్ను తన పేరు మీదనే పొడగించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న అనురాగ్ శర్మ.. నిందితుల మీద ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వినోద్ శర్మ తనను తాను మాజీ న్యాయశాఖ అధికారిగా పరిచయం చేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’ -
పార్కింగ్లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో కలిసి ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) తెలిపింది. కష్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్ స్టికర్ గల కార్లు.. పార్కింగ్ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదని వివరించింది. ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్ తెలిపింది . చదవండి: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు.. -
మెట్రో స్టేషన్లో నాగుపాము కలకలం
న్యూఢిల్లీ: ఒకప్పుడు పాములు ఎక్కడ ఉంటాయి? అని అడిగితే ఊరి చివర పుట్టల్లో, పొలాల్లో, అడవుల్లో అని చెప్పేవాళ్లం. కానీ అవి కూడా వలస వచ్చాయి.. జనావాసాల్లోకి! ఇంటి కప్పు మీద, వంటగదిలో, ఆఖరికి ఇంట్లోని బాత్రూమ్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీలోని సాకెట్ మెట్రో స్టేషన్ ద్వారం దగ్గర శుక్రవారం నాలుగడుగుల నాగుపాము పాగా వేసి అక్కడి సిబ్బందిని హడలెత్తించింది. దీంతో సిబ్బంది వెంటనే వైల్డ్లైఫ్ ఎస్వోఎస్ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారమిచ్చారు. (జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..) వారు ఘటనా స్థలానికి చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. ఇంకా మెట్రో రైళ్లు ప్రారంభం కాకపోవడంతో అక్కడ జనాలు ఎవరూ లేకపోయేసరికి పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఇటీవలే సాకెట్ మెట్రో స్టేషన్లో కొండచిలువను, ఓక్లా బర్డ్ సాంక్చుయరీ మెట్రో స్టేషన్లో నాగుపామును రక్షించినట్లు వైల్డ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. (పాముల కాలం.. జర భద్రం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement