గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల కేంద్రంలో గురువారం ఓ మతిస్థిమితంలేని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.
గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల కేంద్రంలో గురువారం ఓ మతిస్థిమితంలేని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మెయిన్ రోడ్డులోని విద్యుత్ స్తంభం ఎక్కి రూ. 1000 ఇస్తేనే కిందికి దిగుతాను లేకుంటే దూకుతాను అని బెదిరించాడు. స్థానికులు విద్యుత్ సరఫరా ఆపివేసి అతన్ని కిందికి దించేందుకు ప్రయత్నించారు.
(దుగ్గిరాల)