అనంతపురం : అనంతపురం నగరంలోని స్థానిక పీటీసీ సమీపంలో ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పాతూరులోని ఐలమ్మ కాలనీకి చెందిన చాకలి రామకృష్ణ (49) మునిసిపల్ కాంప్లెక్స్లో ఉన్న ఓ డ్రైక్లీనింగ్ దుకాణంలో పని చేస్తుండేవాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ నెల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం తిరిగి వచ్చాడు. పని చేసే దుకాణానికి వెళ్లి డబ్బులు ఇప్పించుకుని మద్యం సేవించాడు.
తర్వాత ఎక్కడికి పోయాడో తెలీదు. గురువారం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇదే చోట రెండు పందులు కూడా మృతి చెందాయి. ఏమైనా పందుల పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటాడా ? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే శవాన్ని రైలు లాక్కెల్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అయితే రామకృష్ణ మృతదేహం సుమారు పది అడుగుల మేరకు లాక్కెళ్లిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు.
దీంతో ప్రమాదవశాత్తూ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
Published Thu, May 7 2015 10:34 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement