నటన కాస్త శ్రుతి మించడంతో.. | man commits suicide over illegal affairs | Sakshi
Sakshi News home page

నటన కాస్త శ్రుతి మించడంతో..

Sep 16 2018 7:42 AM | Updated on Oct 9 2018 5:43 PM

man commits suicide over illegal affairs - Sakshi

శ్రీకాకుళం /పార్వతీపురం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఓ యువకుడు తన ప్రాణాలనే వదులుకోవాల్సి వచ్చింది. తనతో వచ్చిన మహిళ  చెప్పిన మాట వినకపోవడంతో బెదిరించాలనే ఉద్దేశంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు నటించాడు. అయితే బెదిరింపు కాస్త శ్రుతిమించడంతో ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది.  పార్వతీపురం పట్టణ ఎస్సై ఉప్పిలి మహేష్‌ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కోదులగుమడ గ్రామానికి చెందిన ఆవుల రవికి (24), విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరుకు చెందిన ఓ వివాహితతో రెండేళ్లుగా పరిచయం ఉంది.

 ఇదిలా ఉండగా ఆ వివాహిత తన భర్త వద్దకు వెళ్లడానికి శుక్రవారం విజయవాడ బయలుదేరింది. ఈ విషయం రవికి తెలియజేయడంతో పార్వతీపురంలో కలుద్దామని చెప్పి రమ్మన్నాడు. దీంతో వివాహిత పార్వతీపురంలో దిగి రవిని కలిసింది. అనంతరం పాలకొండ రోడ్డులో ఉన్న లక్ష్మణ్‌ లాడ్జిలో ఓ గది తీసుకున్నారు. రాత్రంతా అక్కడ గడిపి మరుచటి రోజు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే  శుక్రవారం రాత్రి తనతో సన్నిహితంగా ఉండాలని రవి కోరగా వివాహిత తిరస్కరించింది. దీంతో అసహనానికి గురైన రవి ఆమెను బెదిరిస్తే దారికొస్తుందని భావించి, నువ్వు ఒప్పుకోకపోతే చనిపోతానని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు నటించాడు. ఆ నటన కాస్త శ్రుతి మించడంతో ప్రాణాలమీదకు వచ్చింది.

 ఉరి వేసుకుంటున్న సమయంలో ముడి బిగిసిపోవడంతో రవి గిలగిలా కొట్టుకున్నాడు. వెంటనే ఆ మహిళ అతడిని కాపాడే ప్రయత్నం చేస్తూ గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న లాడ్జి సిబ్బంది వచ్చి రవిని దించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని కొన ఊపిరితో ఉన్న రవిని పోలీసు వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవికి భార్య, పిల్లలున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పట్టణ ఎస్సై మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement