శ్రీశైలం వద్ద ప్రమాదం: వ్యక్తి మృతి | lorry driver dies of accident in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం వద్ద ప్రమాదం: వ్యక్తి మృతి

Jun 10 2015 6:46 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం ప్రాజెక్టు వజ్రాలమడుగు వద్ద వంతెన నిర్మాణం పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

ఈగలపెంట (కర్నూలు): శ్రీశైలం ప్రాజెక్టు వజ్రాలమడుగు వద్ద వంతెన నిర్మాణం పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఒక లారీ డ్రైవర్ చనిపోయాడు. ఈగలపెంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సుండిపెంట మండల కేంద్రానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ కొంత కాలంగా డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా కంపెనీకి చెందిన టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

రోజు మాదిరిగానే కంకర లోడుతో డ్యాం వద్దకు రాగానే  లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి ప్రాజెక్టు దిగువ భాగంలో నిల్వ ఉంచిన నీటిలో పడిపోయింది. ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ లారీతో పాటు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. రఫీకి తల్లిదండ్రులతో పాటూ ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement