రాష్ర్టం కలిసి ఉంటే బాగుండేది

రాష్ర్టం కలిసి ఉంటే బాగుండేది - Sakshi


 ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉంటే ఎంతో బాగుండేదని ప్రముఖ సినీనటుడు కృష్ణభగవాన్ అన్నారు. పట్టణంలో స్వీట్‌హోం  ప్రారంభోత్సవానికి  ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక డైలాగ్ చెప్పాలని అభిమానులు కోరగా, వెంకీ సినిమాలో గుర్తింపు పొందిన ‘జీఎం గావాల్నా...ఎజీఎం గావాల్నా...బంకు గావాల్నా... జింకు గావాల్నా’ డైలాగ్ చెప్పి అందరినీ న వ్వించారు. అనంతరం ‘సాక్షి’ విలేకరితో కాసేపు ముచ్చటించారు.

 

 ప్రస్తుతం సినీపరిశ్రమ పరిస్థితి ఏంటి?

 కృష్ణభగవాన్: ప్రస్తుతం సినీపరిశ్రమ పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణా ప్రాంతంలోనూ, సీమాంధ్ర ప్రాంతంలోనూ చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాల్సి ఉంది.

 

 జాన్ అప్పారావు సినిమాలో హీరోగా మెప్పించారు కదా? మళ్లీ హీరోగా ఏదైనా సినిమా చేయాలనుకుంటున్నారా?

 కృష్ణభగవాన్:  అప్పుడలా కలిసొచ్చేసింది (అంటూ తన బాణీలో నవ్వుతూ టైమింగ్ డైలాగ్ వదిలారు.) అప్పారావు ప్రేక్షకులను నవ్వించాడు...ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి ప్రస్తుతం హీరో ఆలోచన లేదు.

 

  మీరు చేస్తున్న కొత్త సినిమాల సంగతేంటి?

 కృష్ణభగవాన్:  కొత్త హీరోల చిత్రాల్లో చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్టులు చేయాల్సి ఉంది.

 

చిత్ర పరిశ్రమలో మీ స్థానమేంటి?

 కృష్ణభగవాన్:  ప్రస్తుతం ఎందరో హాస్యనటులు సినిమాల్లోకి కొత్తగా వస్తున్నప్పటికి నాకు మాత్రం సరైన పాత్రలు లభిస్తున్నాయి. సినీపరిశ్రమలో అడుగు పెట్టినప్పటినుంచి హాస్యన టుడిగానే ఉన్నాను ఎప్పటికి అలాగే చిరస్థాయిగా నిలిచిపోవాలని నా కోరిక.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top