'చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి' | Kanna Lakshminarayana takes on Andhra Pradesh Chief minister Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి'

Aug 16 2014 12:56 PM | Updated on Jul 11 2019 8:34 PM

'చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి' - Sakshi

'చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి'

శ్వేతపత్రం పేరుతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, శ్వేతపత్రం పరిశీలన కమిటీ ఛైర్మన్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

విశాఖపట్నం: శ్వేతపత్రం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, శ్వేతపత్రం పరిశీలన కమిటీ ఛైర్మన్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం విశాఖపట్నంలో చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలపై కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఇప్పటికైనా చంద్రబాబు నిజాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

2004 నుంచి 2014 వరకు రైతులకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చిందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలోని రైతులు, మహిళలు మైక్రో ఫైనాన్స్ బారిన పడతారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement