కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం పదో రోజు కూడా విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్పై జూడాలు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు.
జూడాల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం
- రక్తంతో సంతకాలు చేసిన వైద్య విద్యార్థులు
కర్నూలు(హాస్పిటల్): సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేయించాలని హైకోర్టు తీర్పిచ్చినా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ వైద్యుల హక్కులను కాలరాస్తోందని జూనియర్ వైద్యుల సంఘం నాయకులు నిరంజన్, వంశీ విహారి అన్నారు. సోమవారం స్థానిక కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పదో రోజు కూడా జూడాలు విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్పై వైద్యులు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం జూడాలతో చర్చలు చేపట్టకపోవడం దారుణమన్నారు. నిర్బంధ వైద్య విద్య పేరిట జారీ చేసిన జీఓ 107ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యుల సంఘం నేతలు ప్రశాంత్, పవన్, విష్ణు, భాను ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
రక్త సంతకం
Published Tue, Dec 2 2014 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
పాఠశాలల అభివృద్ధి ఇలా...
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement