‘ఉమ్మడి’ పంపిణీ బాధ్యత గవర్నర్‌దే | Joint distribution is Governor's responsibility | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి’ పంపిణీ బాధ్యత గవర్నర్‌దే

Mar 10 2014 12:58 AM | Updated on Sep 2 2017 4:31 AM

‘ఉమ్మడి’ పంపిణీ బాధ్యత గవర్నర్‌దే

‘ఉమ్మడి’ పంపిణీ బాధ్యత గవర్నర్‌దే

తెలంగాణ, సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల పంపిణీని గవర్నర్ నరసింహన్ చేపట్టనున్నారు

  • సచివాలయం సహా రాజధానిలోని ఇతర కార్యాలయాల కేటాయింపు
  •  జనాభా ప్రాతిపదికన ఆఫీస్‌ల విభజన
  •  సీమాంధ్రకు 58.32 శాతం.. తెలంగాణకు 41.68 శాతం
  •  
     సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల పంపిణీని గవర్నర్ నరసింహన్ చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. పదేళ్ల కాలానికి కార్యా లయాలను ఇరు రాష్ట్రాలకు విభజించాల్సి ఉన్నందున, అన్ని శాఖల కార్యాలయ భవనాల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవీ..
     
    •   రాష్ట్ర రాజధానిలోని సచివాలయంతో సహా అన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాల భవనాలన్నింటినీ జనాభా ప్రాతిపదికన విభజిం చాల్సి ఉంది. సీమాంధ్రకు 58.32%, తెలం గాణకు 41.68%  చొప్పున కేటాయిస్తారు.
    •   ఏ భవనాలను ఏ రాష్ట్రానికి కేటాయించాలి, ఏ భవనాల్లో ఎటు పక్కన ఎవరికి కేటాయించాలో రాష్ర్ట గవర్నర్ నిర్ణయిస్తారు.
    •   జీహెచ్‌ఎంసీ పరిధిలో యాజమాన్య నిర్వహణతో పాటు కేటాయింపులు, పంపిణీపై తుది నిర్ణయం గవర్నర్‌దే.
    •   ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. శాంతిభద్రతలతో పాటు అంతర్గత భద్రత, ప్రతిష్టాత్మక సంస్థల రక్షణ బాధ్యత గవర్నర్‌దే.
    •   గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది. సలహాదారులకు కేటాయించిన అంశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించి మార్గదర్శక సూత్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చే స్తుంది.
    •   ఇరు రాష్ట్రాల విభజన తరువాత అవసరమైన అదనపు పోలీసు బలగాల పెంపునకు కేంద్రం సహాయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్వహణ, పరిపాలనను మూడేళ్లపాటు కేంద్ర హోంమంత్రిత్వశాఖ చేపడుతుంది.
    •  
    •   సీమాంధ్రలో కొత్తగా గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇరు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ ఆపరేషనల్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి.
    •   గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని ఏ రాష్ట్ర డీజీపీ కింద పనిచేస్తారో ఇచ్చే ఆప్షన్ ఆధారంగా విభజిస్తారు. ఈ విషయాలన్నింటిలో రాష్ట్ర హోంశాఖ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement