ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు | ISRO Chairman Conducted Special Puja For GSLV F8 Success | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్‌

Mar 28 2018 3:40 PM | Updated on Sep 15 2018 7:45 PM

ISRO Chairman Conducted Special Puja For GSLV F8 Success - Sakshi

సాక్షి, నెల్లూరు : జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌8 రాకెట్‌ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్‌ డా.శివన్‌ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు  కౌంట్‌డౌన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్‌8 రాకెట్‌  నింగిలోకి ఎగరనుంది.

ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్‌-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కె. శివన్‌కు ఇది తొలి ప్రయోగం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement