లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు | Income Tax Raids On Lalitha Rice Mills In Peddapuram | Sakshi
Sakshi News home page

లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు

Feb 13 2020 8:33 PM | Updated on Feb 13 2020 9:10 PM

Income Tax Raids On Lalitha Rice Mills In Peddapuram - Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లలితా రైస్‌ మిల్స్‌లో ఐటీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఏడు బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ తనిఖీలు జరిపారు. కాగా లలితా రైస్‌మిల్స్‌ యజమానులు మట్టే ప్రసాద్‌, శ్రీనివాస్‌.. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అత్యంత సన్నిహితులు. ఖరీదైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షాటెక్స్‌ యంత్రాలతో మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులుగా వీరికి పేరుంది.

కాగా మట్టే సోదరులు.. ఒక షాటెక్స్‌ యంత్రానికి అనుమతి తీసుకుని, దాని పేరు మీద మరిన్ని షాటెక్స్‌ యంత్రాలతో బియ్యాన్ని మిల్లింగ్‌ చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో అచ్చంపేట వద్ద మాజీ హోంమంత్రి చినరాజప్పకు క్యాంప్‌ కార్యాలయం భవనాన్ని మట్టే సోదరులే బహుమతిగా  ఇచ్చారని ప్రచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement