కర్నూలు రూరల్, న్యూస్లైన్ :
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పంచలింగాల సమీపం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తహశీల్దార్ బాలగణేశయ్య ఆర్ఐని అలర్ట్ చేసి అక్కడకు పంపించారు. అనంతరం తాను కూడా బైక్పై వె ళ్లారు. లారీలను ఇసుకతో నింపుకొని డంపు నుంచి బయటకు వస్తుండగా రెండింటిని సీజ్ చేశారు. అయితే అధికారుల రాక ఆలస్యం కావడం, వారి తనిఖీలకు ముందే తెలిసిపోవడంతో ఇసుకాసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇసుక తవ్వకానికి ఉపయోగిస్తున్న జేసీబీ సహా మూడు లారీలతో స్టాన్లీ స్టీఫెన్ ఇంజినీరింగ్ కళాశాల వైపు పరారయ్యారు. తర్వాత వచ్చిన అధికారులు ఇసుక నింపుకొని డంపు దాటి వస్తున్న రెండు లారీలను సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. మరో మూడు వాహనాలు, జేసీబీతో సహా ఇసుకాసురులు పరారైనట్లు తెలిసినప్పటికీ అధికారులు ఆ వైపు వెళ్లకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులే వంతపాడుతున్నారు : తహశీల్దార్
ఇసుక మాఫియా వద్ద నుంచి మామూళ్లు పుచ్చుకుంటూ పోలీసులే వారికి వంతపాడుతూ ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని తహశీల్దార్ బాలగణేశయ్య అన్నారు. ఇసుక లారీలను సీజ్ వివరాలను తహశీల్దార్ గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వెళ్లడించారు. బుధవారం అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా హైదరాబాద్లోని మెహిదీపట్నానికి తరలించేందుకు పంచలింగాల సమీపంలో లారీలకు లోడ్ చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో వెళ్లి రెండింటిని సీజ్ చేశామన్నారు. ఇసుక మాఫియా నియంత్రణలో పోలీసు ల నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉండడం లేదన్నా రు. కొన్ని చోట్ల పోలీసులే దగ్గరుండి మరీ ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్నారు. పంచలింగాల క్రాస్ వద్ద జాతీ య రహదారిపై ఇసుకాసురుల నుంచి మామూళ్లు వసూలు చేస్తుండగా ఈ మధ్య తనిఖీలకు వెళ్లినప్పు డు తాను గమనించానని, ఇదేంటని ప్రశ్నిస్తే వాహనాలు తనిఖీ చేస్తున్నామంటూ బూకాయిం చే ప్రయత్నం చేశారన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులకుకూడాఫిర్యాదు చేశామని తహశీల్దార్ చెప్పా రు.
అక్రమ రవాణాపై నిఘా పెట్టినప్పటికీ ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నామని చెప్పిన తహశీల్దార్ వీరికి రాజకీయ అండదండలున్నట్లు అర్థమవుతోందన్నారు. పంచలింగాల గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇసుకను మెహిదీపట్నం తరలించేం దుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసిందని, ఈ మేరకు రాత్రివేళ్లలో తరలిస్తున్నారని తహశీల్దార్ తెలిపారు.
ఇసుకాసురులపై దాడులు
Published Fri, Nov 8 2013 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement