భర్తను చంపించిన భార్య | Husband killed wife | Sakshi
Sakshi News home page

భర్తను చంపించిన భార్య

Jan 6 2014 4:44 AM | Updated on Jul 30 2018 8:27 PM

గతనెల 24న మండలంలోని మద్దెపల్లితండాకు చెందిన నునావత్ దేవీసింగ్(38) దారుణ హత్య కేసును పోలీ సులు చేధించారు.

 నవీపేట, న్యూస్‌లైన్: గతనెల 24న మండలంలోని మద్దెపల్లితండాకు చెం దిన నునావత్ దేవీసింగ్(38) దారుణ హత్య కేసును పోలీ సులు చేధించారు. మృతుని భార్యే ప్రియుడితో చంపిం చింది. ఆదివారం నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ రె డ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. దేవీ సింగ్ భార్య తారాబాయితో అదే తండాకు చెందిన నునావత్ చం ద్రూకు ఎనిమిదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఇది తండా అంతట పాకింది. అయితే ఈ విషయాన్ని తారాబా యి భర్త దేవీసింగ్ జీర్ణించుకోలేకపోయాడు. పలుమార్లు భార్యను మందలించాడు. పెద్దల సమక్షంలో పం చాయతీ లూ జరిగాయి.దీంతో తారాబాయి తన ప్రియుడు చం ద్రూతో పథకం పన్నింది. తన భర్తను చంపేయాలని ప్రి యుడిని కోరింది. దీంతో చంద్రూ తన అల్లుడు ఫాల్తి యా దేవీసింగ్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మిత్రులు బాదావత్ దేవీసింగ్, బర్ల సాయిలుతో పథకం రచిం చా డు. దీనికి ఒక్కొక్కరికి రూ.20 వేలు చెల్లించేందుకు బేరా న్ని కుదిరింది. గత నెల 21న బొప్ప సంధ్రం చెరువు వద్ద విం దు చేసుకున్నారు. దీనికి తారాబాయి భర్త దేవీసింగ్‌ను కూ డా పిలిచారు. తాగిన మైకంలో ఉన్న దేవీసింగ్ మెడకు ఉరేసి, మర్మాంగాలపై తన్నారు. దీంతో దేవీసింగ్ అక్కడే చనిపోయాడు.
 
 చెరువులో పడేయాలని చెప్పిన భార్య..
 దేవీసింగ్ శవాన్ని ఏం చేయాలని చంద్రూ ప్రశ్నించగా పెద్ద బండకు శవాన్ని కట్టి అక్కడే గల చెరువులో పడేయాలని చె ప్పడంతో నిందితులు శవాన్ని చెరువులో పడేశారు. అనంతరం తారాబాయి పోలీసులను ఆశ్రయించి తన భర్త క న్పించడంలేదంటూ ఫిర్యాదు చేసింది. గతనెల 24న చెరువులో దేవీసింగ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తిం చారు. హ త్యేనని నిర్దారణకు వచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అందుకు అతని భార్య తా రాబాయి ప్రియుడితో చంపించిందని సీఐ చెప్పారు. హ త్యకేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. వారిని ఆదివారం అరెస్టు చేసి రి మాండ్‌కు పంపామన్నారు. భార్య తారాబాయితోపాటు మరో నిందితుడు ఫాల్తియా దేవీసింగ్ పరారీలో ఉన్నారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement