తిరుమలలో తోపులాట: భక్తులకు గాయాలు | Huge Devotees Rush in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తోపులాట: భక్తులకు గాయాలు

May 22 2018 4:27 PM | Updated on May 22 2018 5:42 PM

Huge Devotees Rush in Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం కూడా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 56 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా​ మూడు రోజుల పాటు సర్వదర్శనం స్లాట్‌ టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత, సర్వదర్శనం టోకెన్లను తిరిగి కొనసాగిస్తామని ఆలయ జేఈవో శ్రీనివాస రాజు తెలిపారు.

సర్వదర్శనం స్లాట్‌ ద్వారా ఇప్పటి వరకు 5,42,308 మంది టోకెన్లను పొందగా.. వారిలో 54 వేల మంది మాత్రం దర్శనం చేసుకోలేదన్నారు. మరోవైపు అంగప్రదక్షిణ టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుని పలువురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా భక్తులు రద్దీ ఎక్కువ కావడంతో టీటీడీ సిబ్బంది అదుపు చేయలేకపోయారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement