హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత | High tension at hindupur govt hospital | Sakshi
Sakshi News home page

హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

Mar 21 2015 8:27 AM | Updated on Sep 28 2018 3:39 PM

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుతో పాటు తల్లి మృతి చెందింది.

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుతో పాటు తల్లి మృతి చెందింది. దాంతో బాలింత బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆమె బంధువులు ఆరోపించారు. తల్లి బిడ్డల మృతదేహాలతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి... మృతుల బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement