కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని గురువారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
Aug 10 2017 11:08 AM | Updated on Sep 11 2017 11:46 PM
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని గురువారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, నిర్మాత సురేశ్ బాబు, సినీనటులు నితిన్, మేఘా ఆకాష్, కార్తీ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాయకుల మండలం వద్ద శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
Advertisement
Advertisement