తిరుమలలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం | grand welcome to cm kcr in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

Feb 21 2017 8:45 PM | Updated on Aug 28 2018 5:48 PM

తిరుమలలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం - Sakshi

తిరుమలలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

సీఎం కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.

టీటీడీ అతిథి గృహంలో సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారిని ఆత్మీయంగా పలకరించారు.

బుధవారం ఉదయం సీఎం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి అందజేస్తారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మ వారిని దర్శించుకుంటారు. ఆయనతో పాటు కేటీఆర్‌, కవిత కుటుంబసభ్యులు, మంత్రులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, పద్మారావు, ఐకే రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement