సాక్షి, నెల్లూరు: ‘‘నాకు ఒక్క అవకాశం ఇస్తే సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా.. తెలంగాణను సామాజిక తెలంగాణ చేస్తా.. సీమాంధ్ర నుంచి 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపిస్తే మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పుతా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్కు అధికారమిచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి 33 ఎంపీ స్థానాలు పొంది అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత మరచి తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ఎంతో బాధ కలిగించిందన్నారు. విభజనతో నదీజలాల సమస్య వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని శపథం చేశారు.
టీడీపీ ఐదో ప్రజాగర్జనను బాబు బుధవారం నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ ఒక్కటేనన్నారు. ‘‘హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే.. ఈ దొంగ కాంగ్రెస్, కేసీఆర్ కాదు’’ అని పేర్కొన్నారు. తనకు ప్రధాని పదవి ఇస్తామని చెప్పినా తెలుగుజాతి కోసం వదులుకున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అడ్రస్ లేకుండా చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తన ప్రజాగర్జన ఎన్నికల శంఖారావంలా మారిందని బాబు పేర్కొన్నారు. అంతకుముందు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు సభలో బాబు పలు ఎన్నికల హామీలను కుమ్మరించారు. అవేమిటంటే...
* రైతులను ఆదుకునేందుకు రుణాలను రద్దు చేస్తా.
* డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.
* వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు ఇస్తా.
* బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు ఇస్తాం.
* బీసీ డిక్లరేషన్ తెస్తాం.. బడ్జెట్లో సబ్ప్లాన్ అమలు చేస్తాం.
* కాపుల పేదరికాన్ని పోగొట్టేందుకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్.
* దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా.
* ముస్లింల రిజర్వేషన్లు కొనసాగిస్తా. వారికి రాజకీయ ప్రాధాన్యత
* బ్రాహ్మణుల అభివృద్ధికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం.
* నుంచి బాబు వరుస గర్జనలు
చంద్రబాబు ఈ నెల 8 నుంచి నెలాఖరు వరకూ వరుసగా వివిధ వర్గాల గర్జనలు, ప్రజాగర్జనలు నిర్వహించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 8న హైదరాబాద్లో మహిళ , 16న గుంటూరులో రైతు, 18న అనంతపురంలో బీసీ, 20న హైదరాబాద్లో యువ, 23న వరంగల్లో ఎస్సీ,ఎస్టీ, 28న ఆదిలాబాద్లో గిరిజన గర్జన నిర్వహిస్తారు. 12న విశాఖ, 15న ఖమ్మం, 17న కృష్ణా, 19న కర్నూలు, 21న శ్రీకాకుళం, 22న తూ.గో., 24న కరీంనగర్, 25న మహబూబ్నగర్, 27న కడపల్లో ప్రజాగర్జనలు నిర్వహిస్తారు.
బాబును కలసిన సబితారెడ్డి: మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం చంద్రబాబును కలిశారు. ఈ నెల 9న హైటెక్స్లో జరిగే తన కుమారుడి వివాహానికి ఆయనను ఆహ్వానించారు. ఇదిలావుంటే.. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్రెడ్డి మంగళవారం బాబుతో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
ఒక్క చాన్స్ ఇస్తే.. స్వర్ణాంధ్రను చేస్తా: చంద్రబాబు
Published Thu, Mar 6 2014 3:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement