మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ
సాక్షి, నెల్లూరు : మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన శనివారం నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం బూధనంలో జరిగింది. పూటుగా మద్యం సేవించిన యువకులు చిన్న కారణంతో పరస్పర దాడి చేసుకున్నారు . యువకులు ఒక్కసారిగా మారాణాయుదాలతో దాడికి దిగడంతో అక్కడ ఉన్న ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పరిస్ధితి విషమంగా ఉండడంతో అమెను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.