ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

Published Wed, Feb 24 2016 8:23 PM

Fires coming from express train in psr nellore district

నెల్లూరు: యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రైలులోని రెండు బోగీల నుంచి విపరీతమైన పొగలు వచ్చాయి. దీంతో గూడూరు రైల్వే స్టేషన్లో రైలును ఆపేశారు. వెంటనే సిబ్బంది  మరమ్మతులు చేపట్టారు. మంటలు వ్యాపించడానికి కల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement